ETV Bharat / state

మంత్రి హరీశ్ రావుకు రాఖీ కట్టిన తెరాస మహిళలు

author img

By

Published : Aug 3, 2020, 11:25 AM IST

Updated : Aug 3, 2020, 2:22 PM IST

హైదరాబాద్ కొండాపూర్​లోని మంత్రి హరీశ్​రావు నివాసంలో రక్షా బంధన్​ను పురస్కరించుకుని తెరాస మహిళా నాయకులు ఆయనకు రాఖీ కట్టారు. సోదరీ, సోదరులు ఇంట్లోనే ఉంటూ... సురక్షిత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని మంత్రి కోరారు.

harish rao
harish rao

రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ కొండాపూర్​లోని మంత్రి హరీశ్​రావు నివాసంలో ఆయనకు తెరాస మహిళా నాయకులు రాఖీ కట్టారు. మంత్రి హరీశ్​రావు.. రాష్ట్ర ప్రజలందరికీ రక్షా బంధన్​ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పర్వదినం సోదరసోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. ఈ రక్షాబంధన్‌... సోదరీ, సోదరుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని హరీశ్​రావు ఆకాంక్షించారు.

ఇంట్లోనే ఉంటూ... సురక్షిత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని మంత్రి సూచించారు. కరోనా వైరస్‌పై విజయం సాధించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలను పాటిస్తామని ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేసి వాటిని పాటించాలన్నారు.

మంత్రి హరీశ్ రావుకు రాఖీ కట్టిన తెరాస మహిళలు

ఇదీ చూడండి : పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ కొండాపూర్​లోని మంత్రి హరీశ్​రావు నివాసంలో ఆయనకు తెరాస మహిళా నాయకులు రాఖీ కట్టారు. మంత్రి హరీశ్​రావు.. రాష్ట్ర ప్రజలందరికీ రక్షా బంధన్​ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పర్వదినం సోదరసోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. ఈ రక్షాబంధన్‌... సోదరీ, సోదరుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని హరీశ్​రావు ఆకాంక్షించారు.

ఇంట్లోనే ఉంటూ... సురక్షిత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని మంత్రి సూచించారు. కరోనా వైరస్‌పై విజయం సాధించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలను పాటిస్తామని ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేసి వాటిని పాటించాలన్నారు.

మంత్రి హరీశ్ రావుకు రాఖీ కట్టిన తెరాస మహిళలు

ఇదీ చూడండి : పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

Last Updated : Aug 3, 2020, 2:22 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.