ETV Bharat / state

గులాబీకే పట్టం కట్టిన పట్టభద్రులు... రెండు చోట్లా జయకేతనం

author img

By

Published : Mar 21, 2021, 5:14 AM IST

నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది..హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, నల్గొండ-ఖమ్మం- వరంగల్‌ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి విజయకేతనం ఎగురవేసింది. హైదరాబాద్‌ స్థానం నుంచి సురభి వాణీదేవి గెలవగా, నల్గొండ స్థానాన్ని పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిలబెట్టుకున్నారు.

గులాబీకే పట్టం కట్టిన పట్టభద్రులు... రెండు చోట్ల జయకేతనం
గులాబీకే పట్టం కట్టిన పట్టభద్రులు... రెండు చోట్ల జయకేతనం

నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది..హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, నల్గొండ-ఖమ్మం- వరంగల్‌ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి విజయకేతనం ఎగురవేసింది. హైదరాబాద్‌ స్థానం నుంచి సురభి వాణీదేవి గెలవగా, నల్గొండ స్థానాన్ని పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. అయితే చివరి ఎలిమినేషన్‌ (తీన్మార్‌ మల్లన్న) ఓట్లలో పల్లాకు ఎన్ని పడ్డాయో ఆదివారానికి స్పష్టత రానుంది.

నల్గొండలో ఈ ఓట్ల లెక్క ఇంకా కొనసాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో మిశ్రమ ఫలితాల అనంతరం... ఈ ఎన్నికల్లో తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి వ్యూహాన్ని రూపొందించి, కార్యాచరణకు పూనుకొన్నారు. అనుగుణంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు ప్రణాళికాబద్ధంగా పనిచేయడం సత్ఫలితాలను ఇచ్చింది.

సిట్టింగు స్థానం కోల్పోయిన భాజపా...

భాజపా హైదరాబాద్‌ సిట్టింగు స్థానాన్ని కోల్పోయింది. ఆ పార్టీ అభ్యర్థి రెండోస్థానంలో నిలిచారు. నల్గొండ స్థానంలో భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి నాలుగో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీ ‘హైదరాబాద్‌’లో నాలుగో స్థానం, నల్గొండలో అయిదో స్థానంలో నిలిచింది. ‘నల్గొండ’ నుంచి బరిలో నిలిచిన తెజస అధ్యక్షుడు కోదండరాం, హైదరాబాద్‌ నుంచి పోటీ చేసిన నాగేశ్వర్‌కూ నిరాశ తప్పలేదు.

తెరాస.. భాజపా హోరాహోరీ..

హైదరాబాద్‌ స్థానంలో తెరాస అభ్యర్థి వాణీదేవి గెలుపొందినట్లు శనివారం రాత్రి రిటర్నింగ్‌ అధికారి ప్రియాంక ఆల అధికారికంగా ప్రకటించారు. ఎలిమినేషన్‌ ప్రక్రియ అనంతరం ఆమె విజేతగా నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డి ఓట్లలో రెండో ప్రాధాన్యం కింద భాజపాకు 8,698, స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్‌కు 7,735, తెరాసకు 8,391 ఓట్లు బదిలీ అయ్యాయి. మెజారిటీ ఎవరికీ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్‌ తొలగింపు జరగ్గా.. ఆయన నుంచి తెరాసకు 21,259, భాజపాకు 18,368 ఓట్లు బదిలీ అయ్యాయి. అయినా విజయానికి కావల్సిన 1,68,520 ఓట్లు ఎవరికీ దక్కలేదు.

చివరకు భాజపా అభ్యర్థి రాంచందర్‌రావు తొలగింపు జరగ్గా.. ఆయన నుంచి తెరాస అభ్యర్థి వాణీదేవికి 40,070 ఓట్లు బదిలీ అయ్యాయి. పోలైన ఓట్లలో వాణీదేవి 56.17 శాతం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు కాస్త గందరగోళానికి గురయ్యారు. భాజపా అభ్యర్థిని తొలగించాలా.. వద్దా అనే విషయమై సుదీర్ఘంగా చర్చించారు.

"అప్పటికి రాంచందర్‌రావు ఓట్లు 1,37,566 ఉండగా వాణీదేవి ఓట్లు 1,49,269 ఓట్లు. ఎన్నికల నిర్వహణ చట్టం-1961ని అనుసరించి ఎక్కువ ఓట్లున్న వారిని, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో గెలిచినట్లుగా ప్రకటించవచ్చు. అయినప్పటికీ రాంచందర్‌రావును ఎలిమినేట్‌ చేయాలని నిర్ణయించాం. కోటా ఓట్లు దక్కేవరకు తొలగింపు ప్రక్రియ చేపట్టాం. చివరకు ఓట్ల బదలాయింపుతో తెరాస కోటా ఓట్లను అధిగమించింది. ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా ఫలితాన్ని ప్రకటించాం"

--- ఎన్నికల విభాగం ఉన్నతాధికారి

నల్గొండలో ఉత్కంఠ పోరు..

నల్గొండ స్థానంలో అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపును శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ప్రకటించారు. మెజారిటీపై ఆదివారం ఉదయానికి స్పష్టత వస్తుందన్నారు. మూడో స్థానంలో నిలిచిన తెలంగాణ జన సమితి అభ్యర్థి కోదండరాం ఎలిమినేషన్‌ ప్రక్రియలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 29,128 ఓట్లు రాగా.. రెండో స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 40,901 ఓట్లు వచ్చాయి.

రెండో స్థానంలో నిలిచిన మల్లన్న ఎలిమినేషన్‌ ప్రక్రియ రాత్రి 10.30 గంటలకు ప్రారంభం కావడంతో పోటీలో మిగిలిన ఏకైక అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారని ఆర్వో చెప్పారు. చివరి ఎలిమినేషన్‌ (తీన్మార్‌ మల్లన్న) ఓట్లలో తెరాసకు ఎన్ని దక్కాయో లెక్కిస్తున్నామని, ఆదివారం ఉదయానికి స్పష్టత వస్తుందన్నారు. ఈ స్థానంలో గెలుపు కోటా ఓట్లు 1,83,167.

ఓటింగ్ వివరాలు

కాంగ్రెస్‌, భాజపా రెండో ప్రాధాన్య ఓట్లలో అత్యధికం కోదండరాంకే..

కాంగ్రెస్‌ అభ్యర్థి రాములునాయక్‌ 30,358 వద్ద ఎలిమినేషన్‌ ప్రక్రియకు గురవగా, భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని 44,010 ఓట్ల వద్ద ఎలిమినేట్‌ చేశారు. వీరి బ్యాలెట్‌ పత్రాల్లోని రెండో ప్రాధాన్య ఓట్లలో ఎక్కువ తెజస అధ్యక్షుడు కోదండరాం దక్కించుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఓట్లలో కోదండరాంకు 13,832, తీన్మార్‌ మల్లన్నకు 8,828, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 7,951 ఓట్లు వచ్చాయి. భాజపా అభ్యర్థి ఎలిమినేషన్‌ ప్రక్రియలో 13,477 ఓట్లు కోదండరాంకు రాగా, తీన్మార్‌ మల్లన్నకు 8,897 ఓట్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 10,044 వచ్చాయి.

కేవలం 3 శాతం ఓట్లతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి బయటపడ్డారని, విరివిగా డబ్బులు, దొంగ ఓట్లతో తెరాస గెలిచిందని కౌంటింగ్‌ అనంతరం తీన్మార్‌ మల్లన్న ఆరోపించారు. నైతిక విజయం తనదే అన్నారు.

నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది..హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, నల్గొండ-ఖమ్మం- వరంగల్‌ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి విజయకేతనం ఎగురవేసింది. హైదరాబాద్‌ స్థానం నుంచి సురభి వాణీదేవి గెలవగా, నల్గొండ స్థానాన్ని పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. అయితే చివరి ఎలిమినేషన్‌ (తీన్మార్‌ మల్లన్న) ఓట్లలో పల్లాకు ఎన్ని పడ్డాయో ఆదివారానికి స్పష్టత రానుంది.

నల్గొండలో ఈ ఓట్ల లెక్క ఇంకా కొనసాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో మిశ్రమ ఫలితాల అనంతరం... ఈ ఎన్నికల్లో తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి వ్యూహాన్ని రూపొందించి, కార్యాచరణకు పూనుకొన్నారు. అనుగుణంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు ప్రణాళికాబద్ధంగా పనిచేయడం సత్ఫలితాలను ఇచ్చింది.

సిట్టింగు స్థానం కోల్పోయిన భాజపా...

భాజపా హైదరాబాద్‌ సిట్టింగు స్థానాన్ని కోల్పోయింది. ఆ పార్టీ అభ్యర్థి రెండోస్థానంలో నిలిచారు. నల్గొండ స్థానంలో భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి నాలుగో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీ ‘హైదరాబాద్‌’లో నాలుగో స్థానం, నల్గొండలో అయిదో స్థానంలో నిలిచింది. ‘నల్గొండ’ నుంచి బరిలో నిలిచిన తెజస అధ్యక్షుడు కోదండరాం, హైదరాబాద్‌ నుంచి పోటీ చేసిన నాగేశ్వర్‌కూ నిరాశ తప్పలేదు.

తెరాస.. భాజపా హోరాహోరీ..

హైదరాబాద్‌ స్థానంలో తెరాస అభ్యర్థి వాణీదేవి గెలుపొందినట్లు శనివారం రాత్రి రిటర్నింగ్‌ అధికారి ప్రియాంక ఆల అధికారికంగా ప్రకటించారు. ఎలిమినేషన్‌ ప్రక్రియ అనంతరం ఆమె విజేతగా నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డి ఓట్లలో రెండో ప్రాధాన్యం కింద భాజపాకు 8,698, స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్‌కు 7,735, తెరాసకు 8,391 ఓట్లు బదిలీ అయ్యాయి. మెజారిటీ ఎవరికీ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్‌ తొలగింపు జరగ్గా.. ఆయన నుంచి తెరాసకు 21,259, భాజపాకు 18,368 ఓట్లు బదిలీ అయ్యాయి. అయినా విజయానికి కావల్సిన 1,68,520 ఓట్లు ఎవరికీ దక్కలేదు.

చివరకు భాజపా అభ్యర్థి రాంచందర్‌రావు తొలగింపు జరగ్గా.. ఆయన నుంచి తెరాస అభ్యర్థి వాణీదేవికి 40,070 ఓట్లు బదిలీ అయ్యాయి. పోలైన ఓట్లలో వాణీదేవి 56.17 శాతం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు కాస్త గందరగోళానికి గురయ్యారు. భాజపా అభ్యర్థిని తొలగించాలా.. వద్దా అనే విషయమై సుదీర్ఘంగా చర్చించారు.

"అప్పటికి రాంచందర్‌రావు ఓట్లు 1,37,566 ఉండగా వాణీదేవి ఓట్లు 1,49,269 ఓట్లు. ఎన్నికల నిర్వహణ చట్టం-1961ని అనుసరించి ఎక్కువ ఓట్లున్న వారిని, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో గెలిచినట్లుగా ప్రకటించవచ్చు. అయినప్పటికీ రాంచందర్‌రావును ఎలిమినేట్‌ చేయాలని నిర్ణయించాం. కోటా ఓట్లు దక్కేవరకు తొలగింపు ప్రక్రియ చేపట్టాం. చివరకు ఓట్ల బదలాయింపుతో తెరాస కోటా ఓట్లను అధిగమించింది. ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా ఫలితాన్ని ప్రకటించాం"

--- ఎన్నికల విభాగం ఉన్నతాధికారి

నల్గొండలో ఉత్కంఠ పోరు..

నల్గొండ స్థానంలో అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపును శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ప్రకటించారు. మెజారిటీపై ఆదివారం ఉదయానికి స్పష్టత వస్తుందన్నారు. మూడో స్థానంలో నిలిచిన తెలంగాణ జన సమితి అభ్యర్థి కోదండరాం ఎలిమినేషన్‌ ప్రక్రియలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 29,128 ఓట్లు రాగా.. రెండో స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 40,901 ఓట్లు వచ్చాయి.

రెండో స్థానంలో నిలిచిన మల్లన్న ఎలిమినేషన్‌ ప్రక్రియ రాత్రి 10.30 గంటలకు ప్రారంభం కావడంతో పోటీలో మిగిలిన ఏకైక అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారని ఆర్వో చెప్పారు. చివరి ఎలిమినేషన్‌ (తీన్మార్‌ మల్లన్న) ఓట్లలో తెరాసకు ఎన్ని దక్కాయో లెక్కిస్తున్నామని, ఆదివారం ఉదయానికి స్పష్టత వస్తుందన్నారు. ఈ స్థానంలో గెలుపు కోటా ఓట్లు 1,83,167.

ఓటింగ్ వివరాలు

కాంగ్రెస్‌, భాజపా రెండో ప్రాధాన్య ఓట్లలో అత్యధికం కోదండరాంకే..

కాంగ్రెస్‌ అభ్యర్థి రాములునాయక్‌ 30,358 వద్ద ఎలిమినేషన్‌ ప్రక్రియకు గురవగా, భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని 44,010 ఓట్ల వద్ద ఎలిమినేట్‌ చేశారు. వీరి బ్యాలెట్‌ పత్రాల్లోని రెండో ప్రాధాన్య ఓట్లలో ఎక్కువ తెజస అధ్యక్షుడు కోదండరాం దక్కించుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఓట్లలో కోదండరాంకు 13,832, తీన్మార్‌ మల్లన్నకు 8,828, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 7,951 ఓట్లు వచ్చాయి. భాజపా అభ్యర్థి ఎలిమినేషన్‌ ప్రక్రియలో 13,477 ఓట్లు కోదండరాంకు రాగా, తీన్మార్‌ మల్లన్నకు 8,897 ఓట్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 10,044 వచ్చాయి.

కేవలం 3 శాతం ఓట్లతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి బయటపడ్డారని, విరివిగా డబ్బులు, దొంగ ఓట్లతో తెరాస గెలిచిందని కౌంటింగ్‌ అనంతరం తీన్మార్‌ మల్లన్న ఆరోపించారు. నైతిక విజయం తనదే అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.