ETV Bharat / state

ప్రగతిభవన్​ ఆందోళనకారులను అరెస్ట్​ చేసిన పోలీసులు

author img

By

Published : Sep 25, 2020, 9:08 PM IST

గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్​ కల్పించాలని డిమాండ్​ చేస్తూ సంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘం చలో ప్రగతి భవన్​ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు ప్రగతి భవన్​ వద్ద ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్​ చేసి సమీప పోలీస్​స్టేషన్​కు తరలించారు.

tribals eho protestesd at hyderabad pragathi bhavan was arrested by police
ప్రగతిభవన్​ ఆందోళనకారులను అరెస్ట్​ చేసిన పోలీసులు

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్​ కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయినా ఇంత వరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని సంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గణేష్​ నాయక్​ మండిపడ్డారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్​ కల్పించాలంటూ సంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘం చలో ప్రగతి భవన్​ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు ప్రగతి భవన్​ వద్ద పెద్ద ఎత్తున పోలీస్​ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్​ చేశారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని.. రాచరిక పాలన నడుస్తుందన్నారు. ప్రభుత్వం హరితహారం పేరుతో గిరిజన రైతులు పోడు భూములపై జరుగుతున్న దాడులను ఆపివేయాలని వారు డిమాండ్​ చేశారు. కొత్తగా ఏర్పాటైన తండా గ్రామ పంచాయతీలను రెవెన్యూ పంచాయతీలుగా గుర్తించాలని కోరారు. తండాల అభివృద్ధి కోసం రూ.పది వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్​ కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయినా ఇంత వరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని సంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గణేష్​ నాయక్​ మండిపడ్డారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్​ కల్పించాలంటూ సంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘం చలో ప్రగతి భవన్​ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు ప్రగతి భవన్​ వద్ద పెద్ద ఎత్తున పోలీస్​ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్​ చేశారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని.. రాచరిక పాలన నడుస్తుందన్నారు. ప్రభుత్వం హరితహారం పేరుతో గిరిజన రైతులు పోడు భూములపై జరుగుతున్న దాడులను ఆపివేయాలని వారు డిమాండ్​ చేశారు. కొత్తగా ఏర్పాటైన తండా గ్రామ పంచాయతీలను రెవెన్యూ పంచాయతీలుగా గుర్తించాలని కోరారు. తండాల అభివృద్ధి కోసం రూ.పది వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.