ధరణి పోర్టల్కు సంబంధించిన సమస్యలను వారం, పది రోజుల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ హామీ ఇచ్చినట్లు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్- ట్రెసా తెలిపింది. సచివాలయంలో సీఎస్ను కలిసిన ట్రెసా ప్రతినిధి బృందం ధరణి సమస్యలను వివరించింది.
రెవెన్యూశాఖలో ధీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అన్ని స్థాయిల పదోన్నతులను జనవరి నెలలో చేపడతామని ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చినట్లు ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి చెప్పారు. శాఖలోని ఇతర పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పినట్లు తెలిపారు.
ఇవీచూడండి: దేశవ్యాప్తంగా హైకోర్టు సీజేలు, జడ్జీలు బదిలీ