రాష్ట్రంలో 12 మంది జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నందికొండ నర్సింగ్రావు, మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బి.పాపిరెడ్డి, నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా కె.సాయిరమాదేవి, ఆదిలాబాద్ జిల్లా ప్రధాన జడ్జిగా బి.ఎస్.జగ్జీవన్కుమార్, కరీంనగర్ జిల్లా ప్రధాన జడ్జిగా ఎం.జి.ప్రియదర్శిని నియమితులయ్యారు.
సహకార ట్రైబ్యునల్ ఛైర్పర్సన్గా పి.శ్రీసుధ, మహబూబ్నగర్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జడ్జిగా కె.భవానీ ప్రసాద్, సైబరాబాద్ మొదటి అదనపు జడ్జిగా బి.సురేశ్, సిటీ సివిల్ కోర్టు 14వ అదనపు చీఫ్ జడ్జిగా జె.జీవన్ కుమార్, మెదక్ జిల్లా కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తిగా ఎ.కర్ణకుమార్, సికింద్రాబాద్ సివిల్ కోర్టు 12వ అదనపు ప్రధాన న్యాయమూర్తిగా వై.గోవిందరెడ్డి, ఖమ్మం మూడో అదనపు జిల్లా జడ్జిగా ఎం.శ్యామ్శ్రీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.