బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ముప్పును దృష్టిలో ఉంచుకుని పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 24 వ తేదీ నుంచి 30 వరకు వివిధ మార్గాల్లో రైళ్లను పూర్తిగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఏయే తేదీల్లో రద్దు చేశారో వాటి వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
రద్దయిన రైళ్ల వివరాలు
1. కన్యాకుమారి-హౌరా - 29వ తేదీ
2. తిరువనంతపురం-శాలిమార్ - 27వ తేదీ
3. హౌరా-తిరుచురపల్లి - 27వ తేదీ
4. చెన్నయ్ సెంట్రల్-సంత్రగచ్చి - 27వ తేదీ
5. తాంబరం-జాసిధి - 29వ తేదీ
6. హౌరా-యశ్వంత్ పూర్ - 24వ తేదీ
7. హౌరా-పాండిచ్చేరి - 30వ తేదీ
8. హౌరా-వాస్కోడిగామా - 24వ తేదీ
9. పురులియా-విల్లుపురం - 28వ తేదీ
10. భువనేశ్వర్-బెంగుళుర్ - 23వ తేదీ
11. వాస్కోడిగామా-హౌరా - 27వ తేదీ,
12. హౌరా -మైసూర్ - 28వ తేదీ
13. యశ్వంత్ పూర్ -హౌరా - 27వ తేదీ,
14. హౌరా-ఎర్నాకులం - 29వ తేదీన నడిచే రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.
ఇదీ చూడండి: పొంచి ఉన్న 'యాస్' ముప్పు- అధికారులు అప్రమత్తం