ETV Bharat / state

'రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోతోంది'

author img

By

Published : Jul 31, 2020, 7:18 PM IST

Updated : Jul 31, 2020, 8:11 PM IST

తెరాస ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎస్టీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోతోందని ఉత్తమ్​ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలు, గిరిజనులపై ప్రతిరోజు ఏదో ఓ చోట హింసాకాండ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

tpcc chief uttam kumar reddy fire on cm kcr
tpcc chief uttam kumar reddy fire on cm kcr

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. తనకున్న 13 గుంటల భూమిని తెరాస ప్రభుత్వం లాక్కోవడం వల్లే ఆ రైతు మరణించారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు స్థిరాస్తి వ్యాపారంతో సంబంధాలు ఉన్నట్లు తనకు సమాచారం ఉందని ఆరోపించారు.

'రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోతోంది'

రైతు మరణించించిన తరువాత ఎకరా భూమి ఇస్తున్నామని మంత్రి హరీశ్​రావు ప్రకటన చేయడం ఏమిటని ప్రశ్నించారు. అదేదో ముందే ఇచ్చేస్తే... ఆ రైతు బతికుండేవాడు కదా అని నిలదీశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు, గిరిజనులపై ప్రతిరోజు ఏదో ఓ చోట హింసాకాండ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న ఘటనలపై గవర్నర్‌ను... జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలవడంతో పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామని ఉత్తమ్​కుమార్​ స్పష్టం చేశారు.

ఇదీచదవండి: ఆకాశగంగా.. దూకింది పెంకితనంగా...

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. తనకున్న 13 గుంటల భూమిని తెరాస ప్రభుత్వం లాక్కోవడం వల్లే ఆ రైతు మరణించారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు స్థిరాస్తి వ్యాపారంతో సంబంధాలు ఉన్నట్లు తనకు సమాచారం ఉందని ఆరోపించారు.

'రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోతోంది'

రైతు మరణించించిన తరువాత ఎకరా భూమి ఇస్తున్నామని మంత్రి హరీశ్​రావు ప్రకటన చేయడం ఏమిటని ప్రశ్నించారు. అదేదో ముందే ఇచ్చేస్తే... ఆ రైతు బతికుండేవాడు కదా అని నిలదీశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు, గిరిజనులపై ప్రతిరోజు ఏదో ఓ చోట హింసాకాండ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న ఘటనలపై గవర్నర్‌ను... జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలవడంతో పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామని ఉత్తమ్​కుమార్​ స్పష్టం చేశారు.

ఇదీచదవండి: ఆకాశగంగా.. దూకింది పెంకితనంగా...

Last Updated : Jul 31, 2020, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.