ETV Bharat / state

REVANTH: వైఎస్​ షర్మిలకు స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చిన రేవంత్​ రెడ్డి

వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్​ షర్మిల.. తనపై చేసిన వ్యాఖ్యలపై రేవంత్​రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఆమె కుటుంబంలో సమస్యలున్నాయని.. అన్న ఆదరణ కరవైందని.. అన్న మీద కోపం తమమీద ఎందుకు చూపించాలంటూ.. సెటైర్లు వేశారు.

author img

By

Published : Jul 16, 2021, 7:52 PM IST

tpcc chief revanth reddy
tpcc chief revanth reddy

వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలకు ఘాటైన కౌంటర్​ ఇచ్చారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి. చలో రాజ్​భవన్​ కార్యక్రమంలో ఉద్రిక్తత దృష్ట్యా అరెస్ట్​ అయిన రేవంత్​ను అంబర్​పేట్​ పోలీస్​ స్టేషన్​కు తరలించారు. కొద్దిసేపు ఉంచి.. అనంతరం విడుదల చేశారు. ఠాణా నుంచి బయటకు వచ్చినప్పుడు రేవంత్​రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు.

'మీది చంద్రబాబు కొడుకుల కంపెనీ.. దానికి సీఈవో రేవంత్​రెడ్డి' అని షర్మిల కామెంట్​ చేశారంటూ మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా..

దీనిపై రేవంత్​ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుగా.. అన్న మీద కోపం మా మీద ఎందుకు చూపించాలంటూ ఎద్దేవా చేశారు.

'నేను ఎన్​జీవో ఆర్గనైజేషన్​ల గురించి మాట్లాడదలచుకోలే.. రాజకీయ పార్టీలు, నేతలు ఎవరైనా మాట్లాడితే స్పందిస్తా. రాజశేఖర్​రెడ్డి బిడ్డ దుఃఖంలో ఉన్నది.. కుటుంబంలో సమస్యలు.. అన్న ఆదరణ కరవైంది.. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుగా.. అన్న మీద కోపం ఉంటే మా మీద ఎందుకు చూపించాలి. ఆమె ఏం మాట్లాడినా.. మేం సీరియస్​గా తీసుకోవడం లేదు. మీరు కూడా అదే చేస్తే తెలంగాణకు మేలు జరుగుతుంది'.

- రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

REVANTH: వైఎస్​ షర్మిలకు స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చిన రేవంత్​ రెడ్డి

ఇదీచూడండి: REVANTH: కోకాపేట భూబాగోతం వివరాలు రేపు బయటపెడతా : రేవంత్‌ రెడ్డి

వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలకు ఘాటైన కౌంటర్​ ఇచ్చారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి. చలో రాజ్​భవన్​ కార్యక్రమంలో ఉద్రిక్తత దృష్ట్యా అరెస్ట్​ అయిన రేవంత్​ను అంబర్​పేట్​ పోలీస్​ స్టేషన్​కు తరలించారు. కొద్దిసేపు ఉంచి.. అనంతరం విడుదల చేశారు. ఠాణా నుంచి బయటకు వచ్చినప్పుడు రేవంత్​రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు.

'మీది చంద్రబాబు కొడుకుల కంపెనీ.. దానికి సీఈవో రేవంత్​రెడ్డి' అని షర్మిల కామెంట్​ చేశారంటూ మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా..

దీనిపై రేవంత్​ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుగా.. అన్న మీద కోపం మా మీద ఎందుకు చూపించాలంటూ ఎద్దేవా చేశారు.

'నేను ఎన్​జీవో ఆర్గనైజేషన్​ల గురించి మాట్లాడదలచుకోలే.. రాజకీయ పార్టీలు, నేతలు ఎవరైనా మాట్లాడితే స్పందిస్తా. రాజశేఖర్​రెడ్డి బిడ్డ దుఃఖంలో ఉన్నది.. కుటుంబంలో సమస్యలు.. అన్న ఆదరణ కరవైంది.. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుగా.. అన్న మీద కోపం ఉంటే మా మీద ఎందుకు చూపించాలి. ఆమె ఏం మాట్లాడినా.. మేం సీరియస్​గా తీసుకోవడం లేదు. మీరు కూడా అదే చేస్తే తెలంగాణకు మేలు జరుగుతుంది'.

- రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

REVANTH: వైఎస్​ షర్మిలకు స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చిన రేవంత్​ రెడ్డి

ఇదీచూడండి: REVANTH: కోకాపేట భూబాగోతం వివరాలు రేపు బయటపెడతా : రేవంత్‌ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.