1. పాత పద్ధతిలోనే
రాష్ట్రంలో నేటి నుంచి పాత పద్ధతిలో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం రిజిస్ట్రేషన్ల శాఖ సర్వం సిద్ధం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. నేడే ప్రారంభం
రాష్ట్రంలోని రహదారులకు మహర్థశ పట్టుకుంది. తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ది పనులకు కేంద్రం వేల కోట్ల రూపాయలను కేటాయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. చిగురించిన ఆశలు
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజులు రానే వస్తున్నాయంటూ యువత తమ మేధకు సానపెట్టేందుకు సిద్ధమవుతోంది. కలల కొలువుల్ని సొంతం చేసుకునే క్రతువును నిర్విఘ్నంగా సాగించేందుకు నడుంబిగిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. హోర్డింగ్ల మాయాజాలం
మహానగరంలో ఎక్కడ చూసినా హోర్డింగ్ల రూపంలో వేలాది ప్రకటనల బోర్డులు కనిపిస్తుంటాయి. వీటన్నింటికీ అనుమతి ఉందని భావిస్తే పప్పులో కాలేసినట్లే. అధికారుల అండ తమకు ఉండగా అడిగేవారెవరన్న భావన నిర్వాహకుల్లో కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. సోనూసూద్కు ఆలయం
సిద్దిపేట జిల్లా దుల్మిట్ట మండలం దుబ్బతండాలో గుడి కట్టి అందులో విగ్రహం ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. గుడిలో నిత్య పూజలు చేస్తామని గ్రామస్థులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. మరోసారి ఆలోచించండి
రైతు సంఘాలను మరోమారు చర్చలకు ఆహ్వానించింది కేంద్రం. చర్చలకు అనుకూల తేదీని నిర్ణయించాలని కోరింది. ఈ మేరకు నిరసన తెలుపుతున్న కర్షక సంఘాలకు లేఖ రాసింది కేంద్ర వ్యవసాయ శాఖ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. వియత్నాం ప్రధానితో మోదీ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ, వియత్నాం ప్రధాని నుగుయెన్ జువాన్ ఫుక్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించే దిశగా కీలక చర్చలు జరపనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ఆకాశంలో అద్భుతం
ఆకాశంలో అద్భుతం జరగనుంది. గురు, శని గ్రహాలు ఒక్కటిగా కనిపించనున్నాయి. 400 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇలాంటి మహా సంయోగం రాత్రి వేళ జరగడం 800 వందల ఏళ్లలో ఇదే తొలిసారి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఒడిశా అమ్మాయికి లవ్లెటర్స్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.. ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన నటిస్తున్న 'ఏ1 ఎక్స్ప్రెస్', నిర్మించిన 'వివాహ భోజనంబు' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలను సందీప్ కిషన్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. కోహ్లీతో పాటే షమీ
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో గాయపడిన టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ.. సిరీస్కు పూర్తిగా దూరంకానున్నట్లు తెలుస్తోంది. అతడు కోలుకోవడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు షమీ స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.