ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Aug 22, 2020, 11:02 AM IST

TOP TEN NEWS AT 11AM
టాప్​టెన్​ న్యూస్​ @11AM
  • ప్రవేశ పరీక్షల షెడ్యూలు ఖరారు..

వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూలును ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఈనెల 31న టీఎస్‌ ఈసెట్‌ నిర్వహణ.. సెప్టెంబర్‌ 9 నుంచి 14 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ‌ 21 నుంచి 24 వరకు పీజీఈసెట్‌.. 28, 29 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌.. సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 1న టీఎస్‌ ఐసెట్‌ నిర్వహణకు సన్నాహాలు చేయనున్నట్టు పేర్కొంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • ప్రధాని పండుగ శుభాకాంక్షలు

వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. భగవంతుడి ఆశీర్వాదాలు ఎల్లవేళలా దేశ ప్రజలపై ఉంటాయని మోదీ ట్వీట్​ చేశారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • జలవిద్యుత్‌కు ఆయువు పట్టు..

ఉమ్మ‌డి రాష్ట్రంలో మొట్ట‌మొద‌టి రివ‌ర్స‌బుల్ సాంకేతిక ప‌రిజ్ఞానం క‌లిగిన జ‌ల విద్యుత్ కేంద్రంగా శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు జ‌ల విద్యుత్ కేంద్రం ప్రావిణ్యం గావించింది. 1.2 కిలోమీట‌ర్ల భూగ‌ర్బంలో నిర్మించిన దేశంలోని మొట్ట‌మొద‌టి విద్యుత్ కేంద్రంగా కూడా చెప్పుకోవ‌చ్చు. శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు విద్యుత్ కేంద్రం అనేక ప్ర‌త్యేక‌త‌లను, సాంకేతికత‌ను సొంతం చేసుకుంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • వాగు దాటి వైద్యం..

ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంద్రవెల్లి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ప్రజలు జ్వరాల బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న జిల్లా ఏజెన్సీ అదనపు వైద్యాధికారి మనోహర్ ఇంద్రవెల్లి పీహెచ్​సీ, వైద్య సిబ్బందితో మండలంలోని మార్కాపూర్ పంచాయతీ పరిధిలోని మామిడి గూడా గ్రామానికి చేరుకున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • వెలుగులు ఇంట.. కారు చీకట్లు

జనాలకు వెలుగులు పంచిన చిరుదివ్వెలు వారు. అకస్మాత్తుగా జరిగిన అగ్నిప్రమాదంలో ఆహుతులయ్యారు. విధి నిర్వహణలో బలైపోయి... కుటుంబసభ్యులకు దూరంగా అనంతలోకాలకు తరలిపోయారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదం... నిండు జీవితాలను కాలగర్భంలో కలిపేసింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • శాంతించిన గోదారమ్మ..

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగిన గోదావరి శనివారం శాంతించింది. భద్రాచలం వద్ద వరద 53.2 అడుగులకు చేరడం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • దేశంలో కరోనా విజృంభణ..

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోగా.. అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఒక్కరోజే 69,878 కేసులు నమోదు కాగా.. 945 మంది కొవిడ్​కు బలయ్యారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • అమెరికా అందరిదీ..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థిగా జో బైడెన్‌ను ఎన్నుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది డెమొక్రాటిక్‌ పార్టీ. నాలుగు రోజుల పాటు జరిగిన పార్టీ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అందరిదని, ఇక్కడ వివక్షకు తావుండబోదన్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • రోహిత్​ శర్మకు బీసీసీఐ అభినందనలు

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్​రత్న అందుకోనున్న టీమ్​ఇండియా ఓపెనర్​ రోహిత్​ శర్మకు అభినందనలు తెలిపింది బీసీసీఐ. దీంతో పాటు అర్జున అవార్డును తీసుకోనున్న పేసర్​ ఇషాంత్​ శర్మ, మహిళా క్రికెటర్​ దీప్తి శర్మను ప్రశంసించింది. పూర్తి వివరాకై క్లిక్​ చేయండి

  • ప్రభాస్​కు చెల్లిగా నివేదా థామస్​!

దర్శకుడు నాగ్​ అశ్విన్​, హీరో ప్రభాస్​ కలయికలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో డార్లింగ్​కు సోదరిగా నివేదా థామస్ నటించనుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • ప్రవేశ పరీక్షల షెడ్యూలు ఖరారు..

వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూలును ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఈనెల 31న టీఎస్‌ ఈసెట్‌ నిర్వహణ.. సెప్టెంబర్‌ 9 నుంచి 14 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ‌ 21 నుంచి 24 వరకు పీజీఈసెట్‌.. 28, 29 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌.. సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 1న టీఎస్‌ ఐసెట్‌ నిర్వహణకు సన్నాహాలు చేయనున్నట్టు పేర్కొంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • ప్రధాని పండుగ శుభాకాంక్షలు

వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. భగవంతుడి ఆశీర్వాదాలు ఎల్లవేళలా దేశ ప్రజలపై ఉంటాయని మోదీ ట్వీట్​ చేశారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • జలవిద్యుత్‌కు ఆయువు పట్టు..

ఉమ్మ‌డి రాష్ట్రంలో మొట్ట‌మొద‌టి రివ‌ర్స‌బుల్ సాంకేతిక ప‌రిజ్ఞానం క‌లిగిన జ‌ల విద్యుత్ కేంద్రంగా శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు జ‌ల విద్యుత్ కేంద్రం ప్రావిణ్యం గావించింది. 1.2 కిలోమీట‌ర్ల భూగ‌ర్బంలో నిర్మించిన దేశంలోని మొట్ట‌మొద‌టి విద్యుత్ కేంద్రంగా కూడా చెప్పుకోవ‌చ్చు. శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు విద్యుత్ కేంద్రం అనేక ప్ర‌త్యేక‌త‌లను, సాంకేతికత‌ను సొంతం చేసుకుంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • వాగు దాటి వైద్యం..

ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంద్రవెల్లి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ప్రజలు జ్వరాల బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న జిల్లా ఏజెన్సీ అదనపు వైద్యాధికారి మనోహర్ ఇంద్రవెల్లి పీహెచ్​సీ, వైద్య సిబ్బందితో మండలంలోని మార్కాపూర్ పంచాయతీ పరిధిలోని మామిడి గూడా గ్రామానికి చేరుకున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • వెలుగులు ఇంట.. కారు చీకట్లు

జనాలకు వెలుగులు పంచిన చిరుదివ్వెలు వారు. అకస్మాత్తుగా జరిగిన అగ్నిప్రమాదంలో ఆహుతులయ్యారు. విధి నిర్వహణలో బలైపోయి... కుటుంబసభ్యులకు దూరంగా అనంతలోకాలకు తరలిపోయారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదం... నిండు జీవితాలను కాలగర్భంలో కలిపేసింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • శాంతించిన గోదారమ్మ..

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగిన గోదావరి శనివారం శాంతించింది. భద్రాచలం వద్ద వరద 53.2 అడుగులకు చేరడం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • దేశంలో కరోనా విజృంభణ..

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోగా.. అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఒక్కరోజే 69,878 కేసులు నమోదు కాగా.. 945 మంది కొవిడ్​కు బలయ్యారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • అమెరికా అందరిదీ..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థిగా జో బైడెన్‌ను ఎన్నుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది డెమొక్రాటిక్‌ పార్టీ. నాలుగు రోజుల పాటు జరిగిన పార్టీ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అందరిదని, ఇక్కడ వివక్షకు తావుండబోదన్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • రోహిత్​ శర్మకు బీసీసీఐ అభినందనలు

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్​రత్న అందుకోనున్న టీమ్​ఇండియా ఓపెనర్​ రోహిత్​ శర్మకు అభినందనలు తెలిపింది బీసీసీఐ. దీంతో పాటు అర్జున అవార్డును తీసుకోనున్న పేసర్​ ఇషాంత్​ శర్మ, మహిళా క్రికెటర్​ దీప్తి శర్మను ప్రశంసించింది. పూర్తి వివరాకై క్లిక్​ చేయండి

  • ప్రభాస్​కు చెల్లిగా నివేదా థామస్​!

దర్శకుడు నాగ్​ అశ్విన్​, హీరో ప్రభాస్​ కలయికలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో డార్లింగ్​కు సోదరిగా నివేదా థామస్ నటించనుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.