IT Raids in Hyderabad : హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. మూడు రియల్ ఎస్టేట్ సంస్థలపై ఈ ఉదయం నుంచి ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో దాదాపు 50 బృందాలు పాల్గొన్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. శ్రీ ఆదిత్య హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోటారెడ్డి, అతని కుమారుడు ఆదిత్య రెడ్డి ఇళ్లతో పాటు ఈ సంస్థల ప్రధాన కార్యాలయాలతో పాటు వాటి అనుబంధ సంస్థలు, బంధువులు, స్నేహితుల ఇళ్లపైనా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ సంస్థలు నిర్వహిస్తున్న స్తిరాస్థి వ్యాపారానికి, అవి చెల్లిస్తున్న ఆదాయ పన్నుకు పొంతన లేకపోవడంతో దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన అధికారులు.. ఆయా సంస్థలపై కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్, కూకట్పల్లిలతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి నుంచి కనీసం మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త ఊర్జిత కన్స్ట్రక్షన్స్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో, కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కుత్బుల్లాపూర్ కొంపల్లిలోని ఊర్జిత కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న విల్లాల్లో ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు ట్యాక్స్ ఎగవేత విషయంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
ఇవీ చదవండి: