ETV Bharat / state

టీఎన్​జీవో అధ్యక్షుడు మామిళ్లకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

author img

By

Published : Sep 3, 2020, 4:12 PM IST

రాష్ట్రంలో నూతనంగా టీఎన్​జీవో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మామిళ్ల రాజేందర్ ప్రగతి భవన్​లో మంత్రి కేటీఆర్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​ మామిళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.

tngo president rajendar meet minister ktr
టీఎన్​జీవో అధ్యక్షుడు మామిళ్లకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

మంత్రి కేటీఆర్​ను టీఎన్​జీవో నూతన అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ కలిశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కొత్తగా టీఎన్​జీవో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మామిళ్ల రాజేందర్ మర్యాదపూర్వకంగా మంత్రి కేటీఆర్​ను ప్రగతి భవన్​లో కలిశారు. ఈ కార్యక్రమంలో టీఎన్​జీవో మాజీ అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు మమత పాల్గొన్నారు.

మామిళ్ల రాజేందర్​ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రస్తుతం ఆయన బాధ్యత పెరిగిందని..ఉద్యోగులు ఆయన మీద ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉండాలన్నారు. ప్రసుత్త పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు.

మంత్రి కేటీఆర్​ను టీఎన్​జీవో నూతన అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ కలిశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కొత్తగా టీఎన్​జీవో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మామిళ్ల రాజేందర్ మర్యాదపూర్వకంగా మంత్రి కేటీఆర్​ను ప్రగతి భవన్​లో కలిశారు. ఈ కార్యక్రమంలో టీఎన్​జీవో మాజీ అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు మమత పాల్గొన్నారు.

మామిళ్ల రాజేందర్​ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రస్తుతం ఆయన బాధ్యత పెరిగిందని..ఉద్యోగులు ఆయన మీద ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉండాలన్నారు. ప్రసుత్త పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి : 'రెండు చేతులు కోల్పోయి... సాయం కోసం ఎదురుచూపులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.