ఉద్యోగుల సమస్యల్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్.. ఎమ్మెల్సీ కవితని కోరారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన కవితని టీఎన్జీవో నాయకులు హైదరాబాద్లోని ఆమె నివాసంలో కలిశారు.
తెలంగాణ సాధనలో ఉద్యోగులు ముందున్నారని, రాష్ట్ర అభివృద్ధిలోనూ పాటుపడ్డారని కవిత కొనియాడారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తన వంతు సహకారం ఉంటుందని వారికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, పూర్వ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మరింత మమేకమై పనిచేయాలి: చాడ వెంకట్ రెడ్డి