ఆంధ్రప్రదేశ్లో హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని గ్రహించి.. సీఎం జగన్ దేవాలయాలకు శంకుస్థాపనలు, గోపూజలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. లౌకికవాదమే తెలుగుదేశం మూల సిద్ధాంతమని... అయితే ఇటీవల కొన్నివర్గాల తమపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు.
![atchhannaidu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10307521_391_10307521_1611119637190.png)
లోక్సభ ఉపఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తిరుపతిలో ఏర్పాటుచేసిన పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయాన్ని అచ్చెన్న ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో తిరుపతి లోక్సభ పరిధి తెదేపా నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆ భూములన్నీ ప్రభుత్వానియే : శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్