రెండు పట్టభద్రుల మండలి ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయని కేంద్ర ఎన్నికల కమిషన్కు పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ నిరంజన్ లేఖ రాశారు. నియోజకవర్గాలు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల పేర్లు లేవని వివరించారు.
ఒక నియోజకవర్గానికి చెందిన ఓటర్లు మరో నియోజకవర్గంలో ఉన్నారని.. ఉదాహరణలతో కూడిన వివరాలు లేఖలో ప్రస్తావించారు. ఆ తప్పులు ఓటర్ల జాబితా చోటు చేసుకున్నట్లు వెల్లడించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఓటర్ల జాబితాను సవరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో ఓటర్లకు పోలీంగ్కు ముందు స్లిప్పులు పంపిణీ చేయడం సాధ్యం కాదని, పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేని పరిస్థితి ఉంటుందని చెప్పారు. అందువల్ల ఓటింగ్ శాతం కూడా తగ్గే ప్రమాదం ఉందని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇదీ చూడండి : రాహుల్ గాంధీతో భేటీ అయిన మధు యాష్కీ