హైదరాబాద్ హబీబ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మల్లెపల్లి చౌరస్తా వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో దుండగులు చోరీకి యత్నించారు. ఏటీఎం మెషిన్ డిస్ప్లేను ధ్వంసం చేశారు. చోరీ విఫలం కావటం వల్ల పారిపోయారు.
గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించి విచారణ ప్రారంభించారు. ఎలాంటి చోరీ జరగలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.