ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడిలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న కొడుకునే తండ్రి పొట్టన పెట్టుకున్నాడు. బొద్దిడి గ్రామానికి చెందిన అడ్డాకుల కాంతారావు, మజ్జేశ్వరరావు తండ్రి కొడుకులు. తండ్రి కాంతారావు కోడిని పెంచుకుంటుండగా.. మజ్జేశ్వరరావు ఆ కోడిని చంపేశాడు.
ఈ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కాంతారావు కొడుకును కత్తితో పొడిచాడు. దీనితో మజ్జేశ్వరరావు మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ చూడండి: బూడిద లోడుతో వెళ్తున్న లారీ బోల్తా... డ్రైవర్, క్లీనర్ మృతి