బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ 19వ వార్షికోత్సవ వేడుకలను ఆసుపత్రి ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, బోర్డు సభ్యులు కోడెల శివప్రసాద్ రావు, నామ నాగేశ్వరరావు, సంస్థ ఉద్యోగులు, తదితర నేతలు పాల్గొన్నారు.
దివంగత నేత నందమూరి తారకరామారావు, బసవతారకం దంపతులకు ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం 19వ వార్షికోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించారు. మహోన్నత ఆశయంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారని కోడెల శివప్రసాద్ అభిప్రాయపడ్డారు. సేవలు మరింత విస్తృతం చేస్తామని తెలిపారు.
ఎలాంటి లాభాలను ఆశించకుండా అంతర్జాతీయ స్థాయి వైద్యాన్ని కేన్సర్ రోగులకు అందించే లక్ష్యంతో బసవతారకం ఆసుపత్రి పనిచేస్తోందని ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ స్పష్టం చేశారు. రోగులకు మానసిక దృఢత్వాన్ని అందించడంలో తాము ఎంతగానో కృషిచేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి: వనజీవి ఆశయం.. పిల్లలకు పాఠ్యాంశం..