ETV Bharat / state

'తెలంగాణలో అస్థిరతకు భాజపా కుట్ర' - That party for political instability in the state: Karne Prabhakar

కేంద్ర ప్రభుత్వం జోక్యం వల్లే ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ స్పందించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ తెలిపారు.

that-party-for-political-instability-in-the-state-karne-prabhakar
రాష్ట్రంలో రాజకీయ అస్థిరత కోసం ఆ పార్టీ : కర్నె ప్రభాకర్
author img

By

Published : Nov 29, 2019, 11:55 PM IST

తెలంగాణకు న్యాయబద్దంగా రావాల్సిన నిధుల విషయంలో అన్యాయం చేస్తున్న కేంద్రం ఆర్టీసీపై ఎలా స్పదింస్తుందని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. ఆర్టీసీని ఆదుకోవడానికి కేంద్రం ఏదైనా సాయం చేసి ఉంటే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పేది నిజమని నమ్మే వాళ్లమని అన్నారు.

ఆర్టీసీ నష్టాల్లో పాలుపంచుకోకుండా, సమ్మె విషయంలో కేసీఆర్​కు సలహాలిచ్చే హక్కు ఉండదని లక్ష్మణ్​కు తెలియకపోవడం విచారకరమన్నారు. ఆర్టీసీ విషయంలో కేసీఆర్ ఉదారంగా వ్యవహరించారని పలువురు ప్రశంసిస్తుంటే, లక్ష్మణ్ మాత్రం చవకబారు విమర్శలు చేస్తూ తన స్థాయిని దిగజార్చుకున్నారని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత కోసం ఆ పార్టీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో రాజకీయ అస్థిరత కోసం ఆ పార్టీ : కర్నె ప్రభాకర్

ఇదీ చూడండి : 'అఘాయిత్యాలకు పాల్పడితే బహిరంగంగా శిక్షించాలి'

తెలంగాణకు న్యాయబద్దంగా రావాల్సిన నిధుల విషయంలో అన్యాయం చేస్తున్న కేంద్రం ఆర్టీసీపై ఎలా స్పదింస్తుందని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. ఆర్టీసీని ఆదుకోవడానికి కేంద్రం ఏదైనా సాయం చేసి ఉంటే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పేది నిజమని నమ్మే వాళ్లమని అన్నారు.

ఆర్టీసీ నష్టాల్లో పాలుపంచుకోకుండా, సమ్మె విషయంలో కేసీఆర్​కు సలహాలిచ్చే హక్కు ఉండదని లక్ష్మణ్​కు తెలియకపోవడం విచారకరమన్నారు. ఆర్టీసీ విషయంలో కేసీఆర్ ఉదారంగా వ్యవహరించారని పలువురు ప్రశంసిస్తుంటే, లక్ష్మణ్ మాత్రం చవకబారు విమర్శలు చేస్తూ తన స్థాయిని దిగజార్చుకున్నారని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత కోసం ఆ పార్టీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో రాజకీయ అస్థిరత కోసం ఆ పార్టీ : కర్నె ప్రభాకర్

ఇదీ చూడండి : 'అఘాయిత్యాలకు పాల్పడితే బహిరంగంగా శిక్షించాలి'

‍TG_HYD_68_29_KARNE_PRABHAKAR_ON_LAXMAN_AB_3064645 REPORTER: Nageshwara Chary ( ) కేంద్ర ప్రభుత్వం జోక్యం వల్లే ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ స్పందించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. అర్థం లేకుండా మాట్లాడుతున్నారని శాసనమండలిలో ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. ఆర్టీసీని ఆదుకోవడానికి కేంద్రం ఏదైనా సాయం చేసి ఉంటే లక్ష్మణ్ చెప్పేది నిజమని నమ్మే వాళ్లమన్నారు. ఆర్టీసి నష్టాల్లో పాలుపంచుకోని కేంద్రానికి సమ్మె విషయం లో కెసిఆర్ కు సలహాలిచ్చే హక్కు ఉండదని లక్ష్మణ్ కు తెలియకపోవడం విచారకరమన్నారు. ఆర్టీసీ విషయంలో కేసీఆర్ ఉదారంగా వ్యవహరించారని ప్రపంచమంతా ప్రశంసిస్తుంటే... లక్ష్మణ్ మాత్రం చవకబారు విమర్శలు చేస్తూ తన స్థాయిని తానే దిగజార్చుకున్నారన్నారు. తెలంగాణ కు న్యాయబద్దంగా రావాల్సిన నిధుల విషయంలో అన్యాయం చేస్తున్న కేంద్రం ఆర్టీసీ పై ఎలా స్పందింస్తుందన్నారు. ప్రైవేటీకరణకు కేంద్రం అనుమతించలేదని లక్ష్మణ్ మరో అబద్దాన్ని చెప్పారని కర్నె ప్రభాకర్ ఆరోపించారు. కేంద్ర చట్టం ఒక విధంగా.. కేంద్ర ప్రభుత్వ వైఖరి మరో విధంగా ఎలా ఉంటాయో లక్ష్మణ్ చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్రం తలదూరుస్తుందని లక్ష్మణ్ చెబుతున్నారంటే భాజపాకి.. ఫెడరల్ వ్యవస్థ పట్ల విశ్వాసం లేదని తేలిపోతోందని కర్నె ప్రభాకర్ ఆరోపించారు. లక్ష్మణ్ అసంబద్ధమైన ప్రకటనలు ఆపకపోతే రాష్ట్రంలో భాజపాకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా వచ్చే ఎన్నికల్లో ఊడిపోతుందన్నారు. ప్రజల్లో కేసీఆర్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి..విపక్షాలు ఓర్వలేక..రాష్ట్రంలో గందరగోళం సృష్టించడానికి విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో.. సీఎం కేసీఆర్‌ పెద్ద మనసుతో నిర్ణయం తీసుకున్నారు భాజపా నేతలు దివాళాకోరు మాటలు మాట్లాడుతున్నారని... రాష్ట్రంలో రాజకీయ అస్థిరత కోసం ఆ పార్టీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. బైట్: కర్నె ప్రభాకర్, శాసనమండలిలో విప్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.