ETV Bharat / state

"రోహిణికి ముందే రోళ్లకు పగుళ్లు"

పగలు ఎండ మంటలు, రాత్రి భరించలేని ఉక్కపోత... ఉదయం 11గంటలు దాటితే నిర్మానుష్యంగా మారుతున్న రహదారులు..రాష్ట్ర వ్యాప్తంగా ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజూ 43 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు.

author img

By

Published : May 26, 2019, 5:57 AM IST

Updated : May 26, 2019, 6:46 AM IST

రోహిణికి ముందే రోళ్లు పగులుతున్నాయి..
రోహిణికి ముందే ....


సూర్యోదయంతోనే భానుడి భగభగలు
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు... ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం పదిరోజులుగా ఎండల తీవ్రత మరింత పెరిగింది. రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెల్లారిందే మొదలు సూర్యోదయంతోనే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటితే చాలు..ఎండ నిప్పుల కొలిమిని తలపిస్తోంది.


అబ్బా ఉక్కపోత... రోడ్లన్నీ నిర్మానుష్యం
ఉదయం 8 గంటలకే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు దాటే వరకు రోడ్లన్నీ నిర్మానుశ్యంగా మారుతున్నాయి. ఎండ వేడిమికి తోడు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఎండలో తిరగకండి...
తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైకి వస్తున్న వారు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తున్నారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బోండాలు, పళ్ల రసాలు తాగుతూ సేద తీరుతున్నారు. వేసవి తాపానికి తట్టుకోలేక పలుచోట్ల వృద్ధులు వడదెబ్బతో మృత్యువాత పడుతున్నారు.

నిప్పుల కొలిమి@45 డిగ్రీలు

అత్యవసర పరిస్థితుల్లో తప్పితే బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. రానున్న రోజులన్నీ రోహిణికార్తెలో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, గర్భిణీలు ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.

ఇవీ చూడండి: ప్రత్యేక హోదాకు సంపూర్ణ మద్దతు

రోహిణికి ముందే ....


సూర్యోదయంతోనే భానుడి భగభగలు
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు... ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం పదిరోజులుగా ఎండల తీవ్రత మరింత పెరిగింది. రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెల్లారిందే మొదలు సూర్యోదయంతోనే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటితే చాలు..ఎండ నిప్పుల కొలిమిని తలపిస్తోంది.


అబ్బా ఉక్కపోత... రోడ్లన్నీ నిర్మానుష్యం
ఉదయం 8 గంటలకే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు దాటే వరకు రోడ్లన్నీ నిర్మానుశ్యంగా మారుతున్నాయి. ఎండ వేడిమికి తోడు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఎండలో తిరగకండి...
తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైకి వస్తున్న వారు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తున్నారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బోండాలు, పళ్ల రసాలు తాగుతూ సేద తీరుతున్నారు. వేసవి తాపానికి తట్టుకోలేక పలుచోట్ల వృద్ధులు వడదెబ్బతో మృత్యువాత పడుతున్నారు.

నిప్పుల కొలిమి@45 డిగ్రీలు

అత్యవసర పరిస్థితుల్లో తప్పితే బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. రానున్న రోజులన్నీ రోహిణికార్తెలో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, గర్భిణీలు ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.

ఇవీ చూడండి: ప్రత్యేక హోదాకు సంపూర్ణ మద్దతు

Intro:జే. వెంకటేశ్వర్లు. డోర్నకల్. 8008574820
........ ...... .......
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి శివారులోని మణికంఠ రైస్ మిల్లు లో చోరీ జరిగింది. రైస్ మిల్ కు సంబంధించిన ఆఫీసు గదికి వేసిన తాళాన్ని దొంగలు పగులగొట్టారు. గది లోపలికి ప్రవేశించిన దొంగలు బీరువా తెరిచారు. బీరువాలో ఉంచిన రూ.21000 నగదు, రూ.5 వేల విలువైన సెల్ల్ఫోన్ తో పాటు విలువైన పత్రాలను అపహరించుకుపోయారు. చోరీ జరిగిన ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.


Body:చోరీ


Conclusion:చోరీ
Last Updated : May 26, 2019, 6:46 AM IST

For All Latest Updates

TAGGED:

summar
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.