ETV Bharat / state

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటల నుంచి సూర్యుడు సుర్రుమంటున్నాడు. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండటం వల్ల వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని హైదరాబాద్​ వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని సూచించింది.

author img

By

Published : May 24, 2020, 5:06 PM IST

రాష్ట్రంలో అధికమవుతోన్న ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో అధికమవుతోన్న ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడు ఉదయం పది గంటల నుంచే ఉగ్రరూపం దాల్చాడు. తెలంగాణలో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. రాగల రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాల వారిగా నమోదైన ఉష్ణోగ్రతలను టీఎస్డీపీఎస్ ప్రకటించింది.

సంఖ్య జిల్లా ఉష్ణోగ్రత (డిగ్రీలలో)
1ఆదిలాబాద్ 45.0
2కుమురం భీం 43.9
3మంచిర్యాల43.9
4నిర్మల్44.8
5నిజామాబాద్44.6
6జగిత్యాల44.9
7పెద్దపల్లి43.4
8జయశంకర్ భూపాల్‌పల్లి43.8
9భద్రాది కొత్తగూడెం 42.3
10మహబూబాబాద్41.7
11వరంగల్ రూరల్ 42.6
12వరంగల్ అర్బన్ 41.9
13కరీంనగర్ 44.0
14రాజన్న సిరిసిల్ల 45.1
15కామారెడ్డి43.9
16సంగారెడ్డి44.1
17మెదక్‌42.8
18సిద్దిపేట44.0
19జనగాం42.3
20యాదాద్రి భువనగిరి43.1
21మేడ్చల్ మల్కాజిగిరి 43.2
22హైదారాబాద్44.0
23రంగారెడ్డి42.7
24వికారాబాద్44.0
25మహబూబ్‌నగర్ 43.6
26జోగులాంబ గద్వాల 40.5
27వనపర్తి41.0
28నాగర్ కర్నూల్‌ 43.0
29నల్గొండ42.9
30సూర్యాపేట42.3
31ఖమ్మం42.8
32ములుగు41.9
33నారాయణ పేట 42.4

మంగళవారం ఆదిలాబాద్, కుమురం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, నల్గొండ, ఖమ్మం, సూర్యపేట, మహబూబ్ నగర్ జిల్లాలలో కొన్నిచోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇవీ చూడండి: గ్రేటర్​లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్​ కేసులు

రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడు ఉదయం పది గంటల నుంచే ఉగ్రరూపం దాల్చాడు. తెలంగాణలో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. రాగల రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాల వారిగా నమోదైన ఉష్ణోగ్రతలను టీఎస్డీపీఎస్ ప్రకటించింది.

సంఖ్య జిల్లా ఉష్ణోగ్రత (డిగ్రీలలో)
1ఆదిలాబాద్ 45.0
2కుమురం భీం 43.9
3మంచిర్యాల43.9
4నిర్మల్44.8
5నిజామాబాద్44.6
6జగిత్యాల44.9
7పెద్దపల్లి43.4
8జయశంకర్ భూపాల్‌పల్లి43.8
9భద్రాది కొత్తగూడెం 42.3
10మహబూబాబాద్41.7
11వరంగల్ రూరల్ 42.6
12వరంగల్ అర్బన్ 41.9
13కరీంనగర్ 44.0
14రాజన్న సిరిసిల్ల 45.1
15కామారెడ్డి43.9
16సంగారెడ్డి44.1
17మెదక్‌42.8
18సిద్దిపేట44.0
19జనగాం42.3
20యాదాద్రి భువనగిరి43.1
21మేడ్చల్ మల్కాజిగిరి 43.2
22హైదారాబాద్44.0
23రంగారెడ్డి42.7
24వికారాబాద్44.0
25మహబూబ్‌నగర్ 43.6
26జోగులాంబ గద్వాల 40.5
27వనపర్తి41.0
28నాగర్ కర్నూల్‌ 43.0
29నల్గొండ42.9
30సూర్యాపేట42.3
31ఖమ్మం42.8
32ములుగు41.9
33నారాయణ పేట 42.4

మంగళవారం ఆదిలాబాద్, కుమురం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, నల్గొండ, ఖమ్మం, సూర్యపేట, మహబూబ్ నగర్ జిల్లాలలో కొన్నిచోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇవీ చూడండి: గ్రేటర్​లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.