ETV Bharat / state

తెలుగు టెలివిజన్​ పరిశ్రమ 50 ఏళ్ల వేడుక - telugu television industry 50 years meeting in hyderabad

తెలుగు టెలివిజన్ ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నివేదన సభ పేరుతో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్​ను ఈరోజు విడుదల చేశారు. చిత్రీకరణలకు ఫిబ్రవరి 14న సెలవు ప్రకటిస్తూ తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్, వర్కర్స్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. ఆ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా టీవీ చిత్రీకరణలు జరపవద్దని ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగబాల సురేశ్​ కుమార్​ కోరారు.

telugu television industry 50 years meeting in hyderabad in sri nagar colony
నివేదన సభ బ్రోచర్​ను విడుదల చేస్తున్న ఫెడరేషన్​ ప్రతినిధులు
author img

By

Published : Feb 13, 2021, 7:43 PM IST

తెలుగు టెలివిజన్ ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలుగు టెలివిజన్ పరిశ్రమ ఆదివారం భారీ స్థాయి వేడుకకు సిద్ధమైంది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగంలో నివేదన సభ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్​ను ఈరోజు విడుదల చేశారు. తెలుగు టెలివిజన్ టెక్నిషియన్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు 21 యూనియన్ల నుంచి సుమారు 2 వేల మంది కార్మికులు హాజరవుతున్నట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు నాగబాల సురేశ్​ కుమార్​ తెలిపారు.

ఐదు దశాబ్దాల్లో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో పనిచేస్తున్న లక్షలాది కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వివరిస్తామని ఆయన వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీవీ నగర్​ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సభకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​తో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు, నిర్మాతలు హాజరవుతారని నాగబాల సురేశ్​ కుమార్ వెల్లడించారు.

ఇదీ చూడండి : 'ఈనెల 14న తెలుగు టీవీ కార్యక్రమాల చిత్రీకరణకు సెలవు'

తెలుగు టెలివిజన్ ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలుగు టెలివిజన్ పరిశ్రమ ఆదివారం భారీ స్థాయి వేడుకకు సిద్ధమైంది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగంలో నివేదన సభ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్​ను ఈరోజు విడుదల చేశారు. తెలుగు టెలివిజన్ టెక్నిషియన్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు 21 యూనియన్ల నుంచి సుమారు 2 వేల మంది కార్మికులు హాజరవుతున్నట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు నాగబాల సురేశ్​ కుమార్​ తెలిపారు.

ఐదు దశాబ్దాల్లో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో పనిచేస్తున్న లక్షలాది కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వివరిస్తామని ఆయన వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీవీ నగర్​ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సభకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​తో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు, నిర్మాతలు హాజరవుతారని నాగబాల సురేశ్​ కుమార్ వెల్లడించారు.

ఇదీ చూడండి : 'ఈనెల 14న తెలుగు టీవీ కార్యక్రమాల చిత్రీకరణకు సెలవు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.