రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్, విద్యాశాఖ, యూనిసెఫ్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ చివరి దశకు చేరుకుంది. ఆగస్టు 28న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. 7 వేలకు పైగా ఇన్నోవేషన్ ఐడియాలను పంచుకున్నారు.
వీటన్నింటి పరిశీలన ప్రస్తుతం జరుగుతోందని ఈనెలాఖరులోగా... తుది జాబితా సిద్ధమవుతుందని టీఎస్ఐసీ పేర్కొంది. ఫైనలైజ్ అయిన ఐడియాలతో ప్రోటోటైప్ రూపొందించి.. డిసెంబర్ మూడో వారంలో జరగనున్న ఫినాలేలో ప్రదర్శిస్తామన్నారు.
ఇవీచూడండి: వైభవంగా కొనసాగుతున్న తుంగభద్ర నది పుష్కరాలు