ETV Bharat / state

Increase in electricity charges: కరెంటు ఛార్జీల పెంపుపై డిస్కంల కసరత్తు షురూ

author img

By

Published : Sep 23, 2021, 11:01 AM IST

కరెంటు ఛార్జీల పెంపుపై ప్రతిపాదనలివ్వాలని ప్రభుత్వం సూచించడంతో డిస్కంలు లెక్కల సేకరణ కసరత్తు ప్రారంభించాయి. రాష్ట్రంలో ఒక్కో యూనిట్‌ సరఫరాకు సగటు వ్యయం(ఏసీఎస్‌) రూ.7.14 అవుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

electricity bill
electricity bill

కరెంటు ఛార్జీల పెంపుపై ప్రతిపాదనలివ్వాలని ప్రభుత్వం సూచించడంతో డిస్కంలు లెక్కల సేకరణ కసరత్తు ప్రారంభించాయి. రాష్ట్రంలో ఒక్కో యూనిట్‌ సరఫరాకు సగటు వ్యయం(ఏసీఎస్‌) రూ.7.14 అవుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఖర్చుతో పోలిస్తే ఆదాయం సగటున 21 పైసలు తక్కువగా వస్తున్నందున విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు నష్టపోతున్నట్లు కేంద్ర విద్యుత్‌ శాఖ నివేదికలో వెల్లడించింది. తెలంగాణలో విద్యుత్‌ డిమాండు, వినియోగం గణనీయంగా పెరగడంతో బహిరంగ మార్కెట్‌లో కొని సరఫరా చేసినందుకు ఏసీఎస్‌ అధికమవుతోంది. సరఫరా వ్యయం పెరుగుతున్నా.. గత ఐదేళ్లుగా ఛార్జీలను పెంచలేదని, ఆర్థికలోటు ఎక్కువగా ఉందని డిస్కంలు సర్కారుకు నివేదించాయి.

మధ్యతరగతి ప్రజలపై ఇప్పటికే భారం

రాష్ట్రంలో మొత్తం కోటీ 62 లక్షల కరెంటు కనెక్షన్లలో 73 శాతం ఇళ్లకే ఉన్నాయి. కానీ, మొత్తం ఆదాయంలో ఇళ్ల కనెక్షన్ల నుంచి వచ్చేది 35 శాతంలోపే ఉంటోంది. 50 యూనిట్లలోపు వాడితే యూనిట్‌కు రూ.1.45 చొప్పున ఛార్జీ వసూలు చేస్తున్నారు. సగటున నెలకు 200 యూనిట్లలోపు వాడేవారి నుంచి యూనిట్‌కు రూ.5లోపే వసూలుచేస్తున్నామని డిస్కంలు తెలిపాయి. మొత్తం ఇళ్ల కనెక్షన్లు కోటీ 14 లక్షలుంటే వారిలో 200 యూనిట్లలోపు వాడేవారే 87 శాతం ఉన్నందున.. నష్టం అధికంగా వస్తోందని అంచనా. ఈ నష్టాలను పూడ్చడానికే ఛార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరాయి. మరోవైపు నెలకు 300 యూనిట్లకుపైగా వాడే ఇళ్ల నుంచి ‘సగటు వ్యయం’ కన్నా ఎక్కువగా వసూలుచేస్తున్నందున మధ్యతరగతి ప్రజలపై ఇప్పటికే భారం అధికంగా ఉంది.

నష్టాల పెరుగుదలకు ప్రధాన కారణాలు..

* తెలంగాణలో విద్యుత్‌ డిమాండు, వినియోగం గణనీయంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా రోజూవారీ డిమాండు 2021 మార్చి 26న 13,688 మెగావాట్లుగా నమోదైంది. నిరంతరాయ సరఫరా కోసం డిస్కంలు కరెంటు కొనుగోలు చేస్తున్నందున వ్యయం పెరుగుతోంది.

* గత ఆర్థిక సంవత్సరం(2020-21) మొత్తమ్మీద 5,122.22 కోట్ల యూనిట్ల కొనుగోలుకు రూ.22,127 కోట్లను చెల్లించినందున యూనిట్‌ సగటు కొనుగోలు వ్యయం రూ.4.32కి చేరింది. అన్ని వర్గాలకు సరఫరా, ఇతర ఖర్చులు కలిపితే యూనిట్‌ సగటు సరఫరా వ్యయం రూ.7.14కి చేరుతోంది. కానీ, ఇంత ఆదాయం వినియోగదారుల నుంచి రావడం లేదని డిస్కంలు తెలిపాయి.

* ఈ ఏడాది(2021-22) యూనిట్‌ సగటు కొనుగోలు వ్యయం రూ.4.32 ఉంటుందని ఈఆర్‌సీ ఇటీవల నిర్ధారించింది. అంతకన్నా చాలా ఎక్కువ చెల్లించి కొంటేనే నిరంతర సరఫరా సాధ్యమని అంచనా.

ఇదీ చూడండి: Telangana genco CMD prabhakar rao : 'అలా చేస్తే.. రాష్ట్ర విద్యుత్, సాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావం'

కరెంటు ఛార్జీల పెంపుపై ప్రతిపాదనలివ్వాలని ప్రభుత్వం సూచించడంతో డిస్కంలు లెక్కల సేకరణ కసరత్తు ప్రారంభించాయి. రాష్ట్రంలో ఒక్కో యూనిట్‌ సరఫరాకు సగటు వ్యయం(ఏసీఎస్‌) రూ.7.14 అవుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఖర్చుతో పోలిస్తే ఆదాయం సగటున 21 పైసలు తక్కువగా వస్తున్నందున విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు నష్టపోతున్నట్లు కేంద్ర విద్యుత్‌ శాఖ నివేదికలో వెల్లడించింది. తెలంగాణలో విద్యుత్‌ డిమాండు, వినియోగం గణనీయంగా పెరగడంతో బహిరంగ మార్కెట్‌లో కొని సరఫరా చేసినందుకు ఏసీఎస్‌ అధికమవుతోంది. సరఫరా వ్యయం పెరుగుతున్నా.. గత ఐదేళ్లుగా ఛార్జీలను పెంచలేదని, ఆర్థికలోటు ఎక్కువగా ఉందని డిస్కంలు సర్కారుకు నివేదించాయి.

మధ్యతరగతి ప్రజలపై ఇప్పటికే భారం

రాష్ట్రంలో మొత్తం కోటీ 62 లక్షల కరెంటు కనెక్షన్లలో 73 శాతం ఇళ్లకే ఉన్నాయి. కానీ, మొత్తం ఆదాయంలో ఇళ్ల కనెక్షన్ల నుంచి వచ్చేది 35 శాతంలోపే ఉంటోంది. 50 యూనిట్లలోపు వాడితే యూనిట్‌కు రూ.1.45 చొప్పున ఛార్జీ వసూలు చేస్తున్నారు. సగటున నెలకు 200 యూనిట్లలోపు వాడేవారి నుంచి యూనిట్‌కు రూ.5లోపే వసూలుచేస్తున్నామని డిస్కంలు తెలిపాయి. మొత్తం ఇళ్ల కనెక్షన్లు కోటీ 14 లక్షలుంటే వారిలో 200 యూనిట్లలోపు వాడేవారే 87 శాతం ఉన్నందున.. నష్టం అధికంగా వస్తోందని అంచనా. ఈ నష్టాలను పూడ్చడానికే ఛార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరాయి. మరోవైపు నెలకు 300 యూనిట్లకుపైగా వాడే ఇళ్ల నుంచి ‘సగటు వ్యయం’ కన్నా ఎక్కువగా వసూలుచేస్తున్నందున మధ్యతరగతి ప్రజలపై ఇప్పటికే భారం అధికంగా ఉంది.

నష్టాల పెరుగుదలకు ప్రధాన కారణాలు..

* తెలంగాణలో విద్యుత్‌ డిమాండు, వినియోగం గణనీయంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా రోజూవారీ డిమాండు 2021 మార్చి 26న 13,688 మెగావాట్లుగా నమోదైంది. నిరంతరాయ సరఫరా కోసం డిస్కంలు కరెంటు కొనుగోలు చేస్తున్నందున వ్యయం పెరుగుతోంది.

* గత ఆర్థిక సంవత్సరం(2020-21) మొత్తమ్మీద 5,122.22 కోట్ల యూనిట్ల కొనుగోలుకు రూ.22,127 కోట్లను చెల్లించినందున యూనిట్‌ సగటు కొనుగోలు వ్యయం రూ.4.32కి చేరింది. అన్ని వర్గాలకు సరఫరా, ఇతర ఖర్చులు కలిపితే యూనిట్‌ సగటు సరఫరా వ్యయం రూ.7.14కి చేరుతోంది. కానీ, ఇంత ఆదాయం వినియోగదారుల నుంచి రావడం లేదని డిస్కంలు తెలిపాయి.

* ఈ ఏడాది(2021-22) యూనిట్‌ సగటు కొనుగోలు వ్యయం రూ.4.32 ఉంటుందని ఈఆర్‌సీ ఇటీవల నిర్ధారించింది. అంతకన్నా చాలా ఎక్కువ చెల్లించి కొంటేనే నిరంతర సరఫరా సాధ్యమని అంచనా.

ఇదీ చూడండి: Telangana genco CMD prabhakar rao : 'అలా చేస్తే.. రాష్ట్ర విద్యుత్, సాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.