ETV Bharat / state

బల్దియా పీఠంపై తెరాస విజయం ఖాయం: పద్మారావు గౌడ్

author img

By

Published : Nov 16, 2020, 4:07 PM IST

బల్దియా పీఠంపై తెరాస విజయం ఖాయమని ఉపసభాపతి పద్మారావు గౌడ్ ధీమ వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని తెలిపారు.

telangana deputy speaker padma rao goud
బల్దియా పీఠంపై తెరాస విజయం ఖాయం పద్మారావు గౌడ్

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస కార్పొరేటర్లు తమ సత్తాను చాటుకుంటారని ఉపసభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో తెరాస నేతలు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. బౌద్ధనగర్​ డివిజన్​లోని పార్సిగుట్టలో పర్యటించిన పద్మారావు.. బల్దియా పోరులో తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

50 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేపట్టని అభివృద్ధి పనులను కేసీఆర్ సర్కార్ కేవలం 5 ఏళ్లలో చేసి చూపించిందని పద్మారావు అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడుపుతున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రజారంజకమైన పాలన సాగిస్తున్నారని చెప్పారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస కార్పొరేటర్లు తమ సత్తాను చాటుకుంటారని ఉపసభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో తెరాస నేతలు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. బౌద్ధనగర్​ డివిజన్​లోని పార్సిగుట్టలో పర్యటించిన పద్మారావు.. బల్దియా పోరులో తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

50 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేపట్టని అభివృద్ధి పనులను కేసీఆర్ సర్కార్ కేవలం 5 ఏళ్లలో చేసి చూపించిందని పద్మారావు అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడుపుతున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రజారంజకమైన పాలన సాగిస్తున్నారని చెప్పారు.

ఇదీ చదవండి: 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.