ETV Bharat / state

మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి రాష్ట్ర బీసీ సంఘం నేతలు - vice chancellor appointment in universities

తెలంగాణలోని విశ్వవిద్యాలయాల వీసీల నియామకాల్లో 50 శాతం బీసీ వర్గాలను నియమించాలని రాష్ట్ర బీసీ సంఘం డిమాండ్​ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు రాజేష్​ యాదవ్​ వినతిపత్రం సమర్పించారు.

telangana bc leaders met minister sabitha indradreddy in hyderabad
మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి రాష్ట్ర బీసీ సంఘం నేతలు
author img

By

Published : Nov 4, 2020, 6:29 PM IST

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షులు రాజేష్​ యాదవ్​ కలిశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో జరగనున్న వీసీల నియామకాల్లో 50 శాతం బీసీ వర్గాలకు చెందిన వారిని నియమించడంతో పాటు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్​గా బీసీలను నియమించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు.

రెండేళ్లుగా వర్సిటీలకు రెగ్యూలర్​ వైస్ ఛాన్స్​లర్​ లేక శాఖపరంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రికి వివరించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ కాలపరిమితి ముగిసినా.. వారికి రెండు దఫాలుగా పొడిగించిన కాలపరిమితి అయిపోయిందని రాజేష్​ అన్నారు. ఈ విషయంపై సీఎంతో చర్చించి బీసీలకు తగిన న్యాయం చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షులు రాజేష్​ యాదవ్​ కలిశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో జరగనున్న వీసీల నియామకాల్లో 50 శాతం బీసీ వర్గాలకు చెందిన వారిని నియమించడంతో పాటు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్​గా బీసీలను నియమించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు.

రెండేళ్లుగా వర్సిటీలకు రెగ్యూలర్​ వైస్ ఛాన్స్​లర్​ లేక శాఖపరంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రికి వివరించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ కాలపరిమితి ముగిసినా.. వారికి రెండు దఫాలుగా పొడిగించిన కాలపరిమితి అయిపోయిందని రాజేష్​ అన్నారు. ఈ విషయంపై సీఎంతో చర్చించి బీసీలకు తగిన న్యాయం చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండిః ఇకపై ఇంటివద్దనే జీవన్​ ప్రమాణ్​ ధ్రువపత్రం అందజేత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.