ETV Bharat / state

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్సెస్ జగదీశ్‌రెడ్డి - విద్యుత్‌ రంగంపై వాడివే‘ఢీ’గా చర్చ - Jagdish Reddy Latest News

Telangana Assembly Sessions Live News Today 2023 : అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని, రూ.10,000ల కోట్లను జగదీశ్‌రెడ్డి తిన్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని జగదీశ్‌రెడ్డి సభాపతిని కోరారు.

Telangana Assembly Sessions
Telangana Assembly Sessions
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2023, 2:38 PM IST

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్సెస్ జగదీశ్‌రెడ్డి

Telangana Assembly Sessions Live News Today 2023 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విద్యుత్‌ రంగ సంస్థల ఆర్థిక పరిస్థితిపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసనసభ వేదికగా శ్వేతపత్రం ( White Paper on Power Sector) విడుదల చేశారు. ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య వాడీవేడీగా చర్చ సాగింది. యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రూ.10,000ల కోట్లను జగదీశ్‌రెడ్డి తిన్నారని ఆయన ఆరోపించారు

Minister Komatireddy On Yadadri Plant Corruption : టెండర్‌ పెట్టకుండా ఇవ్వడమే పెద్ద కుంభకోణమని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister KomatiReddy VenkatReddy) ఆరోపించారు. గత ప్రభుత్వం పదవీ విరమణ చేసిన వారిని సంస్థలో నియమించి, డబ్బులు దోచేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్‌ ఎప్పుడూ ఇవ్వలేదని అన్నారు. సబ్‌స్టేషన్లలో లాగ్‌ బుక్‌లు చూస్తే ఇదంతా తెలుస్తుందని చెప్పారు. తాను వెళ్లిన తర్వాత లాగ్‌ బుక్‌లు లేకుండా చేశారన్న మంత్రి కోమటిరెడ్డి రూ.10,000ల కోట్ల కుంభకోణం జరిగింది కాబట్టే నష్టాలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు.

అది శ్వేతపత్రం కాదు - తప్పుడు సమాచార పత్రం : కేటీఆర్

Jagadish Reddy Demands Judicial Inquiry : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై జగదీశ్‌రెడ్డి (JagdishReddy) స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందన్నది అవాస్తవమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్‌ సరఫరా నాణ్యతను పెంచామని చెప్పారు. అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ అందించామని తెలిపారు. తమ హయాంలో అర ఎకరం కూడా ఎండలేదని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు.

అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు : విద్యుత్‌పై ధర్నాలు చేసే అవకాశం తాము ఇవ్వలేదని జగదీశ్‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క రోజు కూడా పవర్‌ హాలిడే ఇవ్వలేదని చెప్పారు. ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరికీ అప్పులు ఉన్నాయని, అప్పులు ఉన్నంత మాత్రాన చెడ్డవాళ్లమా అని ప్రశ్నించారు. అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి విద్యుత్‌ రంగంలో అవినీతిపై న్యాయ విచారణ జరిపిస్తామని అన్నారు.

ఎన్ని శ్వేతపత్రాలు పెట్టినా సమాధానం ఇచ్చేందుకు సిద్ధం : హరీశ్‌రావు

Telangana Assembly Sessions 2023 : గత ప్రభుత్వంలో జగదీశ్‌రెడ్డి పవర్‌ లేని పవర్‌ మినిస్టర్‌ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అప్పుడు అసలైన పవర్‌ మినిస్టర్‌ ప్రభాకరరావు అని చెప్పారు. విద్యుత్‌ విషయంలో జగదీశ్‌రెడ్డికి ఏమీ తెలియదని, న్యాయ విచారణ తర్వాత జగదీశ్‌రెడ్డి, ప్రభాకర్‌రావు, ఇద్దరూ జైలుకు వెళ్తారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోస్యం చెప్పారు.

మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి ఛాలెంజ్​ - ఆ మూడు ప్రాజెక్టులపై న్యాయ విచారణకు సీఎం రేవంత్​ ఆదేశం

తెలంగాణ విద్యుత్ శాఖ అప్పులు రూ. 81,516 కోట్లు : భట్టి విక్రమార్క

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్సెస్ జగదీశ్‌రెడ్డి

Telangana Assembly Sessions Live News Today 2023 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విద్యుత్‌ రంగ సంస్థల ఆర్థిక పరిస్థితిపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసనసభ వేదికగా శ్వేతపత్రం ( White Paper on Power Sector) విడుదల చేశారు. ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య వాడీవేడీగా చర్చ సాగింది. యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రూ.10,000ల కోట్లను జగదీశ్‌రెడ్డి తిన్నారని ఆయన ఆరోపించారు

Minister Komatireddy On Yadadri Plant Corruption : టెండర్‌ పెట్టకుండా ఇవ్వడమే పెద్ద కుంభకోణమని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister KomatiReddy VenkatReddy) ఆరోపించారు. గత ప్రభుత్వం పదవీ విరమణ చేసిన వారిని సంస్థలో నియమించి, డబ్బులు దోచేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్‌ ఎప్పుడూ ఇవ్వలేదని అన్నారు. సబ్‌స్టేషన్లలో లాగ్‌ బుక్‌లు చూస్తే ఇదంతా తెలుస్తుందని చెప్పారు. తాను వెళ్లిన తర్వాత లాగ్‌ బుక్‌లు లేకుండా చేశారన్న మంత్రి కోమటిరెడ్డి రూ.10,000ల కోట్ల కుంభకోణం జరిగింది కాబట్టే నష్టాలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు.

అది శ్వేతపత్రం కాదు - తప్పుడు సమాచార పత్రం : కేటీఆర్

Jagadish Reddy Demands Judicial Inquiry : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై జగదీశ్‌రెడ్డి (JagdishReddy) స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందన్నది అవాస్తవమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్‌ సరఫరా నాణ్యతను పెంచామని చెప్పారు. అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ అందించామని తెలిపారు. తమ హయాంలో అర ఎకరం కూడా ఎండలేదని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు.

అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు : విద్యుత్‌పై ధర్నాలు చేసే అవకాశం తాము ఇవ్వలేదని జగదీశ్‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క రోజు కూడా పవర్‌ హాలిడే ఇవ్వలేదని చెప్పారు. ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరికీ అప్పులు ఉన్నాయని, అప్పులు ఉన్నంత మాత్రాన చెడ్డవాళ్లమా అని ప్రశ్నించారు. అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి విద్యుత్‌ రంగంలో అవినీతిపై న్యాయ విచారణ జరిపిస్తామని అన్నారు.

ఎన్ని శ్వేతపత్రాలు పెట్టినా సమాధానం ఇచ్చేందుకు సిద్ధం : హరీశ్‌రావు

Telangana Assembly Sessions 2023 : గత ప్రభుత్వంలో జగదీశ్‌రెడ్డి పవర్‌ లేని పవర్‌ మినిస్టర్‌ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అప్పుడు అసలైన పవర్‌ మినిస్టర్‌ ప్రభాకరరావు అని చెప్పారు. విద్యుత్‌ విషయంలో జగదీశ్‌రెడ్డికి ఏమీ తెలియదని, న్యాయ విచారణ తర్వాత జగదీశ్‌రెడ్డి, ప్రభాకర్‌రావు, ఇద్దరూ జైలుకు వెళ్తారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోస్యం చెప్పారు.

మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి ఛాలెంజ్​ - ఆ మూడు ప్రాజెక్టులపై న్యాయ విచారణకు సీఎం రేవంత్​ ఆదేశం

తెలంగాణ విద్యుత్ శాఖ అప్పులు రూ. 81,516 కోట్లు : భట్టి విక్రమార్క

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.