ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైకాపాలో చేరే అవకాశముందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్ బుధవారం విశాఖలో వైకాపాలో చేరారు. సీఎం జగన్ పాలన చూసి చాలా మంది వైకాపాలో చేరుతున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. ‘గంటా శ్రీనివాసరావు కొన్ని ప్రతిపాదనలు పంపారు. ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తర్వాత గంటా పార్టీలోకి వచ్చే అవకాశముంది’ అని తెలిపారు.
మరో వైపు వైకాపాలో గంటా చేరిక ప్రతిపాదనను మొదటి నుంచి మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యతిరేకిస్తున్నారు. బుధవారం విశాఖలో జరిగిన.. కాశీవిశ్వనాథ్ వైకాపాలో చేరిక కార్యక్రమానికి అవంతి శ్రీనివాస్ దూరంగా ఉన్నారు. దీంతో విశాఖ వైకాపాలో వర్గపోరు మొదలైందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: ఆరేళ్లుగా ప్రశ్నిస్తున్నా.. మరో అవకాశం ఇవ్వండి: రాంచందర్రావు