ETV Bharat / state

బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు అధ్యక్షుడుగా బండి సంజయ్​

author img

By

Published : Feb 23, 2023, 8:22 PM IST

Tarun Chugh comments on Bandisanjay: బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడుగా బండి సంజయ్​ కొనసాగుతారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. వచ్చే నెల 11వ తేదీతో బండి సంజయ్ మూడేళ్ల పదవీ కాలం ముగుస్తున్న సందర్భంలో బండిసంజయ్​ను మళ్లీ అధ్యక్ష పదవిలో కొనసాగించేందుకు జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Bandisanjay
Bandisanjay

Tarun Chugh comments on Bandisanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి వచ్చే నెల 11వ తేదీతో బండి సంజయ్ మూడేళ్ల పదవి కాలం ముగుస్తున్న తరుణంలో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్​ చుగ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు బండి సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు 2024లో జరుగుతాయని పేర్కొన్న ఆయన.. అంత వరకు అధ్యక్షుడిగా బండిసంజయ్​ను కొనసాగించాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిపారు. అధికారిక ప్రకటన మార్చి మొదటి వారంలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అధికారం చేపట్టిన బండి సంజయ్ ​కుమార్ మొదటి నుంచి​ ఆపార్టీ బలోపేతానికి తన వంతు ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మహాసంగ్రామ పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను గుర్తించారు. ఎక్కడిక్కడ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ కేసీఆర్​ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేసేవారు. జాతీయ నాయకులను సభలకు ఆహ్వానించి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సహం నింపేవారు. బడుగుబలహీన వర్గాల సమస్యలను గుర్తించి బీజేపీ తరుపున ఆ సమస్యలపై పోరాటం చేసేవారు.

హుజూరాబాద్​, దుబ్బాక ఉపఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ఎంతో పాటుపడ్డారు. మునుగోడు ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి కోమాటిరెడ్డి రాజాగోపాల్​రెడ్డి తరపున ప్రచారం కోసం ఎంతో శ్రమించారు. చివరకు ఆ ఎన్నికలో పార్టీ ఓటమిపాలైనా ఏమాత్రం నిరాశ చెందకుండా కార్యకర్తలకు ధైర్యం నింపారు. చివరకు ప్రధాని మోదీ సైతం బండిసంజయ్​పై ఓ సందార్భంలో ప్రశంసల జల్లు కురిపించారు. సంజయ్​ కష్టపడే నాయకుడని.. తెలంగాణలో బీజేపీ గెలవడానికి తన వంతు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇప్పుడు తరుణ్ చుగ్ ప్రకటనతో ఈ ఏడాది జరిగే అసెంబ్లీలో ఎన్నికల్లో బండి సంజయ్ సారథ్యంలోనే బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టమైంది.

Tarun Chugh comments on Bandisanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి వచ్చే నెల 11వ తేదీతో బండి సంజయ్ మూడేళ్ల పదవి కాలం ముగుస్తున్న తరుణంలో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్​ చుగ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు బండి సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు 2024లో జరుగుతాయని పేర్కొన్న ఆయన.. అంత వరకు అధ్యక్షుడిగా బండిసంజయ్​ను కొనసాగించాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిపారు. అధికారిక ప్రకటన మార్చి మొదటి వారంలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అధికారం చేపట్టిన బండి సంజయ్ ​కుమార్ మొదటి నుంచి​ ఆపార్టీ బలోపేతానికి తన వంతు ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మహాసంగ్రామ పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను గుర్తించారు. ఎక్కడిక్కడ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ కేసీఆర్​ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేసేవారు. జాతీయ నాయకులను సభలకు ఆహ్వానించి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సహం నింపేవారు. బడుగుబలహీన వర్గాల సమస్యలను గుర్తించి బీజేపీ తరుపున ఆ సమస్యలపై పోరాటం చేసేవారు.

హుజూరాబాద్​, దుబ్బాక ఉపఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ఎంతో పాటుపడ్డారు. మునుగోడు ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి కోమాటిరెడ్డి రాజాగోపాల్​రెడ్డి తరపున ప్రచారం కోసం ఎంతో శ్రమించారు. చివరకు ఆ ఎన్నికలో పార్టీ ఓటమిపాలైనా ఏమాత్రం నిరాశ చెందకుండా కార్యకర్తలకు ధైర్యం నింపారు. చివరకు ప్రధాని మోదీ సైతం బండిసంజయ్​పై ఓ సందార్భంలో ప్రశంసల జల్లు కురిపించారు. సంజయ్​ కష్టపడే నాయకుడని.. తెలంగాణలో బీజేపీ గెలవడానికి తన వంతు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇప్పుడు తరుణ్ చుగ్ ప్రకటనతో ఈ ఏడాది జరిగే అసెంబ్లీలో ఎన్నికల్లో బండి సంజయ్ సారథ్యంలోనే బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టమైంది.

ఇవీ చదవండి:

'అదంతా ఉత్తదే... మేం అధికారంలోకి వస్తే అన్ని ఉంటాయ్'

మజ్లిస్‌కు బీఆర్ఎస్ సపోర్ట్... ఎన్నికల నుంచి బీజేపీ ఔట్

మోదీ వ్యాక్సిన్ కనిపెట్టారంట.. అయితే నోబెల్ అవార్డు ఇయ్యాలె: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.