తన బెయిల్ షరతులను సడలించాలంటూ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. మంగళవారం జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్యం ధర్మాసనం.. గాలి జనార్ధన్ రెడ్డి పిటిషన్ను విచారించింది.
ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్పై సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని గాలి జనార్ధన్రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనాన్ని కోరారు. అందుకు అంగీకరించిన జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం... రెండు వారాల గడువు ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.