సికింద్రాబాద్లో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విన్ట్సన్ అనే విద్యార్థి డెంగ్యూ జ్వరంతో గత నెల 31వ తేదీన మృతి చెందటంతో కుటుంబసభ్యులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. కొడుకు మృతికి పాఠశాల పరిసరాల అపరిశుభ్రతే కారణమన్నారు. ఈ విషయంలో యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందినట్లు ఆరోపించారు. ఇదే కాకుండా పాఠశాలలో దాదాపు 10మంది విద్యార్థులు కూడా డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. స్పందించిన యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చలు జరిపారు.
ఇవీచూడండి: పంచాయతీరాజ్శాఖపై సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సదస్సు