హైదరాబాద్ అమీర్పేట్ ఎక్స్రోడ్ వద్ద లారీని ఓవర్టేక్ చేయబోగా వాహనం అదుపుతప్పిన ప్రమాదంలో... వాహన చోదకుడు ఆసిఫ్కు గాయాలవగా... వెనక కూర్చున్న సుభాష్ అనే డిగ్రీ విద్యార్థి మృతిచెందాడు.
మృతుడు సుభాష్ మహబూబ్నగర్ కొత్తపల్లి నవాబుపేటకు చెందినవాడని ఎస్ఆర్నగర్ పోలీసులు తెలిపారు. ఎల్బీనగర్లోని నోబుల్ డిగ్రీ కాలేజ్లో చదువుతూ... ఎన్టీఆర్ నగర్లో ఉంటున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇవీ చూడండి : 'నీది వేరే కులం... నిన్నెలా పెళ్లి చేసుకుంటాననుకున్నావ్'