ETV Bharat / state

వెన్నెముక పనిచేయక మంచానే పరిమితమైన భర్త - కుటుంబాన్ని ఆదుకోవాలని మహిళ అభ్యర్థన - Woman Ask to Help TG Government - WOMAN ASK TO HELP TG GOVERNMENT

Woman ask to Help Telangana Govt : వెన్మెముక పనిచేయక భర్త మంచానికే పరిమితం అయ్యాడు. వైద్యం అందించాలంటే నెలకు వేల రూపాయలు కావాలి. ఆ డబ్బు ఉండాలంటే వారిది పేద కుటుంబం. పని చేస్తే కానీ కూడు దొరకని బతుకులు. ఆ ఇల్లాలు పనికి వెళితేనే నోటి కాడికి కూడు. భర్తకు బాగోలేని దగ్గర నుంచి ఆమె ఎక్కడికి వెళ్లకుండా తన పెనిమిటికి సపర్యాలు చేస్తోంది. ఇంట్లో తినడానికి, భర్త వైద్యానికి డబ్బులు లేక మహిళ ప్రభుత్వాన్ని సహాయం కోరారు.

Woman ask to Help Telangana Govt
Woman ask to Help Telangana Govt (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2024, 10:38 PM IST

Woman Ask to Help from Telangana Government : ఆ భార్యాభర్తలు చేరొక పని చేస్తూ ఉన్నంతలో సంసారాన్ని నెట్టుకొచ్చేవారు. కానీ వారి జీవితానికి ఓ రోడ్డు ప్రమాదం అంధకారంలోకి నెట్టేసింది. నాలుగు పదుల వయసులోనే భర్త మంచానికి పరిమితం కావడం, అతడికి వైద్యం చేయించేందుకు ఇల్లాలు పడుతున్న అవస్థలు చూస్తే మనిషన్నవాడు ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. ఆ బాధలు వర్ణనాతీతం.

పూర్తి వివరాల్లోకి వెళితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణం స్టేషన్​ బస్తీకి చెందిన ఎస్కే పాషా, రఫియాలకు పన్నెండేళ్ల క్రితం వివాహం అయింది. పాషా ఇల్లెందు పురపాలక సంఘంలోని చెత్త సేకరణ వాహన డ్రైవర్​గా పని చేస్తుండేవాడు. రఫియా ఓ వస్త్ర దుకాణంలో పని చేసేవారు. అప్పటివరకు వారి జీవితం సాఫీగానే సాగిపోతుంది. కానీ 2021లో ఇల్లెందు-రొంపేడు మార్గంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న పాషాకు ఒక్కసారిగా పంది అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడిపోయాడు.

తీవ్రగాయాలైన పాషా చికిత్స అనంతరం కోలుకున్నారు. కొన్నాళ్లకు మళ్లీ విధుల్లోకి చేరి గత సంవత్సరం నవంబరు వరకు పని చేశాడు. మళ్లీ డిసెంబరులో ఒక్కసారిగా అనారోగ్య సమస్యలు రావడంతో పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకపోగా వెన్నెముకకు ఇన్​ఫెక్షన్​ వచ్చిందని వైద్యులు తెలిపారు. గత ఆరేళ్లుగా వరంగల్​లోని పెద్దాసుపత్రిలో చికిత్స చేయిస్తున్నా పాషా ఆరోగ్యం మాత్రం మెరుగుపడటం లేదు.

వెన్నెముక పనిచేయకపోవడంతో కొద్ది నెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. అప్పటి నుంచి భర్తను రఫియా చూసుకుంటుంది. అతనికి సపర్యాలు చేస్తూ పనికి వెళ్లడం లేదు. దీంతో పూట గడవడం కూడా కష్టమైపోతోంది. మరోవైపు నెలకు రూ.8 వేల వరకు మందులు వాడాల్సి రావడంతో తెలిసిన వారి వద్ద అప్పు చేస్తున్నారు. డాక్టర్ల సూచనలతో వ్యాయామాలు చేయించినా బాధితుడు కదల్లేని పరిస్థితి ఉంది. సంతానం లేని ఈ దంపతులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి భార్య : నా భర్త కాళ్లకు స్పర్శ ఉంది. కానీ వెన్నెముక పని చేయడం లేదు. దీంతో శస్త్రచికిత్స చేయడం కుదరదని వైద్యులు చెప్పారు. వ్యాయామాలు చేయిస్తూ మందులు వాడాలని చెప్పారు. ఆరు నెలలుగా మంచానికే పరిమితం కావడంతో వీపుపై పుండ్లు అయ్యాయి. రోజురోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. నేనూ పనికి వెళ్లలేక పోతున్నాను. మాకు రేషన్​కార్డు లేక ఆరోగ్య శ్రీ వర్తించడం లేదు. ఆరోగ్య శ్రీ కింద మెరుగైన వైద్యం చేయించేందుకు ప్రభుత్వం సహకరించాలి. పింఛన్​ మంజూరు చేయిస్తే కుటుంబం గడిచేందుకు వీలు కలుగుతుంది. అని రఫియా తెలిపారు.

Orphan Kids story in Yadadri : అనాథలైన ముగ్గురు చిన్నారులు.. ఆదుకోవాలని నానమ్మ వేడుకోలు

Woman Ask to Help from Telangana Government : ఆ భార్యాభర్తలు చేరొక పని చేస్తూ ఉన్నంతలో సంసారాన్ని నెట్టుకొచ్చేవారు. కానీ వారి జీవితానికి ఓ రోడ్డు ప్రమాదం అంధకారంలోకి నెట్టేసింది. నాలుగు పదుల వయసులోనే భర్త మంచానికి పరిమితం కావడం, అతడికి వైద్యం చేయించేందుకు ఇల్లాలు పడుతున్న అవస్థలు చూస్తే మనిషన్నవాడు ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. ఆ బాధలు వర్ణనాతీతం.

పూర్తి వివరాల్లోకి వెళితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణం స్టేషన్​ బస్తీకి చెందిన ఎస్కే పాషా, రఫియాలకు పన్నెండేళ్ల క్రితం వివాహం అయింది. పాషా ఇల్లెందు పురపాలక సంఘంలోని చెత్త సేకరణ వాహన డ్రైవర్​గా పని చేస్తుండేవాడు. రఫియా ఓ వస్త్ర దుకాణంలో పని చేసేవారు. అప్పటివరకు వారి జీవితం సాఫీగానే సాగిపోతుంది. కానీ 2021లో ఇల్లెందు-రొంపేడు మార్గంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న పాషాకు ఒక్కసారిగా పంది అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడిపోయాడు.

తీవ్రగాయాలైన పాషా చికిత్స అనంతరం కోలుకున్నారు. కొన్నాళ్లకు మళ్లీ విధుల్లోకి చేరి గత సంవత్సరం నవంబరు వరకు పని చేశాడు. మళ్లీ డిసెంబరులో ఒక్కసారిగా అనారోగ్య సమస్యలు రావడంతో పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకపోగా వెన్నెముకకు ఇన్​ఫెక్షన్​ వచ్చిందని వైద్యులు తెలిపారు. గత ఆరేళ్లుగా వరంగల్​లోని పెద్దాసుపత్రిలో చికిత్స చేయిస్తున్నా పాషా ఆరోగ్యం మాత్రం మెరుగుపడటం లేదు.

వెన్నెముక పనిచేయకపోవడంతో కొద్ది నెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. అప్పటి నుంచి భర్తను రఫియా చూసుకుంటుంది. అతనికి సపర్యాలు చేస్తూ పనికి వెళ్లడం లేదు. దీంతో పూట గడవడం కూడా కష్టమైపోతోంది. మరోవైపు నెలకు రూ.8 వేల వరకు మందులు వాడాల్సి రావడంతో తెలిసిన వారి వద్ద అప్పు చేస్తున్నారు. డాక్టర్ల సూచనలతో వ్యాయామాలు చేయించినా బాధితుడు కదల్లేని పరిస్థితి ఉంది. సంతానం లేని ఈ దంపతులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి భార్య : నా భర్త కాళ్లకు స్పర్శ ఉంది. కానీ వెన్నెముక పని చేయడం లేదు. దీంతో శస్త్రచికిత్స చేయడం కుదరదని వైద్యులు చెప్పారు. వ్యాయామాలు చేయిస్తూ మందులు వాడాలని చెప్పారు. ఆరు నెలలుగా మంచానికే పరిమితం కావడంతో వీపుపై పుండ్లు అయ్యాయి. రోజురోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. నేనూ పనికి వెళ్లలేక పోతున్నాను. మాకు రేషన్​కార్డు లేక ఆరోగ్య శ్రీ వర్తించడం లేదు. ఆరోగ్య శ్రీ కింద మెరుగైన వైద్యం చేయించేందుకు ప్రభుత్వం సహకరించాలి. పింఛన్​ మంజూరు చేయిస్తే కుటుంబం గడిచేందుకు వీలు కలుగుతుంది. అని రఫియా తెలిపారు.

Orphan Kids story in Yadadri : అనాథలైన ముగ్గురు చిన్నారులు.. ఆదుకోవాలని నానమ్మ వేడుకోలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.