ETV Bharat / state

'విద్యా వైద్య రంగాన్ని బలోపేతం చేయండి' - ఏకైక పార్టీ తెలుగుదేశం

రాష్ట్రంలో తెరాస, కేంద్రంలో భాజపా పరస్పర విమర్శలు మాని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత రావుల డిమాండ్ చేశారు.

ప్రభుత్వాలు విద్యా వైద్య రంగాలను బలోపేతం చేయాలి : రావుల
author img

By

Published : Aug 11, 2019, 4:21 PM IST

రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. తెలుగు ప్రజల కష్టాలను అర్థం చేసుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం అని స్పష్టం చేశారు. తెదేపా పేద ప్రజల గొంతుకని.. సామాన్య ప్రజలకు అండదండలు అందించే పార్టీ అని కొనియాడారు. పేద ప్రజలకు వైద్యం అందుబాటులో లేదని.. ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యా, వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విభజన చట్టంలోని హామీలను తక్షణమే అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వాలు విద్యా వైద్య రంగాలను బలోపేతం చేయాలి : రావుల

ఇవీ చూడండి : సోనియాగాంధీ నియామకాన్ని స్వాగతిస్తున్నాం: ఉత్తమ్

రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. తెలుగు ప్రజల కష్టాలను అర్థం చేసుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం అని స్పష్టం చేశారు. తెదేపా పేద ప్రజల గొంతుకని.. సామాన్య ప్రజలకు అండదండలు అందించే పార్టీ అని కొనియాడారు. పేద ప్రజలకు వైద్యం అందుబాటులో లేదని.. ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యా, వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విభజన చట్టంలోని హామీలను తక్షణమే అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వాలు విద్యా వైద్య రంగాలను బలోపేతం చేయాలి : రావుల

ఇవీ చూడండి : సోనియాగాంధీ నియామకాన్ని స్వాగతిస్తున్నాం: ఉత్తమ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.