రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సర పరిహార అటవీ నిర్మూలన కార్యక్రమాలను నిర్వహించడానికి స్టీరింగ్ కమిటీ రూ. 603 కోట్లతో వార్షిక ప్రణాళికను ఆమోదించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో బీఆర్కే భవన్లో 6వ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. పరిహార అటవీ నిర్మూలన(సీఏ), పరివాహక ఏరియా చికిత్స(సీఏటీ), ఇంటిగ్రేటెడ్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ప్లాన్ (ఐడబ్యూఎల్ఎం), నికర ప్రస్తుత విలువ (ఎన్పీవీ) క్యాటగిరీల క్రింద వివిధ పనులు చేపట్టడానికి స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని సోమేష్కుమార్ తెలిపారు.
సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, పీసీసీఎఫ్ శోభ, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారినెలా తొలగిస్తారు?: సుప్రీం