ETV Bharat / state

Green India Challenge: ఎల్లలు దాటిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ - hyderabad district news

భావితరాలు సంతోషంగా ఉండాలంటే ఈ పుడమితల్లిని పచ్చగా ఉంచాలనే ఉద్ధేశంతో... రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ఎల్లలు దాటుతోంది. స్వదేశం విదేశం అనే తేడా లేకుండా గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ ప్రపంచ ప్రముఖులను కదిలిస్తుంది. శ్రీలంక దేశానికి చెందిన డిప్యూటీ హైకమిషనర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా... జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌ నగర్ పార్కులో మొక్కలు నాటారు.

Green India Challenge
Green India Challenge
author img

By

Published : Sep 30, 2021, 7:06 PM IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ శ్రీలంకకు చేరింది. స్వదేశం విదేశం అనే తేడా లేకుండా ప్రపంచమంతా వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ డీ వెంకటేశ్వరన్‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌ నగర్ పార్కులో మొక్కలు నాటారు. తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్‌ వార్మింగ్‌ను అరికట్టేందుకు... పర్యావరణ పరిరక్షణకు నిరంతర కార్యక్రమాలు చేపడుతున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెంకటేశ్వరన్ పేర్కొన్నారు.

సమాజం కోసం నేను అనే మహోన్నత ఆశయంతో జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్... ప్రకృతి విలయాలతో విలవిల్లాడుతున్న నేటి ప్రపంచానికి ఆవశ్యకమైందని డాక్టర్ డీ వెంకటేశ్వరన్‌ తెలిపారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని పరిచయం చేసిన సంతోష్‌కుమార్‌ను మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు.

జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ను శ్రీలంకకు ఆహ్వానించి ప్రధాని మహీంద్ర రాజపక్సేతో కలిసి గ్రీన్ ఛాలెంజ్‌ను శ్రీలంకలో విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పలపాటి శ్రీనివాస్ గుప్తా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: danam nagendar: హుజూరాబాద్ ఎన్నికలపై తెరాస ఎమ్మెల్యే ఆసక్తిర వ్యాఖ్యలు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ శ్రీలంకకు చేరింది. స్వదేశం విదేశం అనే తేడా లేకుండా ప్రపంచమంతా వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ డీ వెంకటేశ్వరన్‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌ నగర్ పార్కులో మొక్కలు నాటారు. తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్‌ వార్మింగ్‌ను అరికట్టేందుకు... పర్యావరణ పరిరక్షణకు నిరంతర కార్యక్రమాలు చేపడుతున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెంకటేశ్వరన్ పేర్కొన్నారు.

సమాజం కోసం నేను అనే మహోన్నత ఆశయంతో జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్... ప్రకృతి విలయాలతో విలవిల్లాడుతున్న నేటి ప్రపంచానికి ఆవశ్యకమైందని డాక్టర్ డీ వెంకటేశ్వరన్‌ తెలిపారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని పరిచయం చేసిన సంతోష్‌కుమార్‌ను మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు.

జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ను శ్రీలంకకు ఆహ్వానించి ప్రధాని మహీంద్ర రాజపక్సేతో కలిసి గ్రీన్ ఛాలెంజ్‌ను శ్రీలంకలో విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పలపాటి శ్రీనివాస్ గుప్తా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: danam nagendar: హుజూరాబాద్ ఎన్నికలపై తెరాస ఎమ్మెల్యే ఆసక్తిర వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.