విద్యతో పాటు సదాచారం, సంస్కారం, సామాజిక, నైతిక విలువలు పెంపొందించడంలో... శిశుమందిర్లు నానాజీ స్పూర్తితో నేటికీ పనిచేస్తున్నాయని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. సరస్వతీ శిశుమందిరాల స్థాపకులు, భారతరత్న నానాజీ దేశ్ముఖ్ జయంతి వేడుకలను హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.
నానాజీ దేశ్ముఖ్ నవ దాదీచి: బండారు దత్తాత్రేయ
సరస్వతీ శిశుమందిరాల స్థాపకులు, భారత రత్న, విద్యావేత్త నానాజీ దేశ్ముఖ్ జయంతి వేడుకలు హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొని నివాళి అర్పించారు. నానాజీ దేశ్ముఖ్ సేవలను కొనియాడారు.
![నానాజీ దేశ్ముఖ్ నవ దాదీచి: బండారు దత్తాత్రేయ నానాజీ దేశ్ముఖ్ నవ దాదీచి: బండారు దత్తాత్రేయ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9134994-1076-9134994-1602423288911.jpg?imwidth=3840)
"ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు" అనే నినాదంతో వందలాది గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత నానాజీ దేశ్ ముఖ్కు చెందుతుందని కొనియాడారు. నానాజీ దేశముఖ్ రాజర్షి అని... ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప విషయంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన మరణానంతరం అవయవాలన్నీ ఎయిమ్స్ ఆస్పత్రికి అందించారని గుర్తుచేసుకున్నారు. నానాజీని నవ దాదీచిగా దత్తాత్రేయ అభివర్ణించారు.
ఇదీ చూడండి: ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలులో మార్పులు
విద్యతో పాటు సదాచారం, సంస్కారం, సామాజిక, నైతిక విలువలు పెంపొందించడంలో... శిశుమందిర్లు నానాజీ స్పూర్తితో నేటికీ పనిచేస్తున్నాయని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. సరస్వతీ శిశుమందిరాల స్థాపకులు, భారతరత్న నానాజీ దేశ్ముఖ్ జయంతి వేడుకలను హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.
"ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు" అనే నినాదంతో వందలాది గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత నానాజీ దేశ్ ముఖ్కు చెందుతుందని కొనియాడారు. నానాజీ దేశముఖ్ రాజర్షి అని... ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప విషయంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన మరణానంతరం అవయవాలన్నీ ఎయిమ్స్ ఆస్పత్రికి అందించారని గుర్తుచేసుకున్నారు. నానాజీని నవ దాదీచిగా దత్తాత్రేయ అభివర్ణించారు.
ఇదీ చూడండి: ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలులో మార్పులు