ETV Bharat / state

మార్కెట్​ యార్డులో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం స్ప్రే

author img

By

Published : Apr 22, 2021, 1:25 PM IST

బోయిన్​పల్లి మార్కెట్​ యార్డులో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ టీఎన్​ శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

 Spray sodium hypochloride solution
Spray sodium hypochloride solution

సికింద్రాబాద్ రెండవ దశ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బోయిన్​పల్లి మార్కెట్​ యార్డులో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ టీఎన్​ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

బోయిన్​పల్లి మార్కెట్​కు ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వచ్చే రైతులు, హమాలీల ఆరోగ్య రీత్యా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు. తన సొంత నిధులతో క్రిమి సంహారక యంత్రాన్ని తీసుకుని మార్కెట్​లోని ప్రతి దుకాణం వద్ద పిచికారీ చేయించారు. మార్కెట్​కు వచ్చే రైతులతో పాటు దుకాణదారులు కూడా కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.

సికింద్రాబాద్ రెండవ దశ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బోయిన్​పల్లి మార్కెట్​ యార్డులో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ టీఎన్​ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

బోయిన్​పల్లి మార్కెట్​కు ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వచ్చే రైతులు, హమాలీల ఆరోగ్య రీత్యా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు. తన సొంత నిధులతో క్రిమి సంహారక యంత్రాన్ని తీసుకుని మార్కెట్​లోని ప్రతి దుకాణం వద్ద పిచికారీ చేయించారు. మార్కెట్​కు వచ్చే రైతులతో పాటు దుకాణదారులు కూడా కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.