ETV Bharat / state

క్లెమెంటో​ పాట పడితే.. క్లైమెట్​ మారిపోద్ది! - folk-singer-and-writer-clemento

తెల్లారి మూడుగొట్టంగ లేచి పాట కట్టిండంటే చాలు... జనం తీన్మార్ ఆడాల్సిందే. పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ దేవతలు సైతం ఆ పాటకు పరవశించి పోవాల్సిందే. అంతలా హుషారెత్తించే ఆయన పాటలకు మనోళ్లే కాదు... పక్క దేశంలోనున్న కుర్రకారూ ఊగిపోతుంటారు. క్యాసెట్ల కాలం నుంచి డీజేల దాకా వేల జానపద గేయాలు రాస్తున్న వ్యక్తి... అతనే మాయదారి మైసమ్మ పాట రచయిత క్లెమెంటో.

clemento
author img

By

Published : Jul 17, 2019, 1:49 PM IST

మాయదారి మైసమ్మ పాట రచయిత క్లెమెంటో​పై ప్రత్యేక కథనం

ఈయన పేరు క్లెమెంటో... తెలంగాణ జానపద గేయాల రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు. 32 ఏళ్ల కిందట మాయదారి మైసమ్మ పాటతో మొదలైన క్లెమెంటో పాటల ప్రస్థానం... అంచలంచెలుగా ఎదుగుతూ.. నాలుగున్నర వేల పాటలకు చేరింది. ఇంకా రాస్తూ... పాడుతూనే ఉన్నారు. క్లెమెంటో రాసిన పాటలు వింటుంటే... తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు... పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు ప్రజల్లో కూడా ఉరిమే ఉత్సాహం వచ్చేస్తుంది. ఆయన పాడుతుంటే ఎంతటి వారైనా సరే అప్రయత్నంగా చిందులేస్తుంటారు. జానపదాలు రాసే రచయితలు ఎంతో మంది ఉన్నా... క్లెమెంటో శైలే వేరు. అందుకే ఏళ్లు గడుస్తున్నా ఆయన రాసిన, రాస్తోన్న.. పాటలు.. గల్లీల్లో మారుమోగుతూనే ఉన్నాయి.

చిన్నప్పటి నుంచే

సికింద్రాబాద్ లాలగూడలో క్రైస్తవ కుటుంబంలో జన్మించిన క్లెమెంటోకు... పాటలు రాయడమంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి. ఎనిమిదో తరగతిలోనే లాలగూడ రైల్వే బాయ్స్ హైస్కూల్​లో వార్షిక పత్రికలో పాట రాసి ప్రశంసలందుకున్నాడు. ఎన్నో చోట్ల అవకాశాల కోసం ప్రయత్నించినా... నిరాశే మిగిలింది.

బోనాల పాట..

1986లో గణేశ్ నిమజ్జన వేడుకల్లో తన మిత్రుల సహకారంతో పాఠశాలలో రాసిన "పెద్ద చిక్కు వచ్చినాదిరో" పాట పాడాడు. ఆ పాట విన్న డీఆర్సీ రికార్డింగ్ కంపెనీ అధినేత యాదగిరిరావు క్లెమెంటోను ప్రోత్సహించి తన ఆడియో క్యాసెట్​లో పాటపాడే అవకాశం ఇచ్చారు. లష్కర్ జాతరలో బోనాల పండుగ పాట పాడిన క్లెమెంటో అక్కడి నుంచి వెనక్కి తిరిగిచూడలేదు. మూడేళ్లలో 80కిపైగా పాటలు రాశాడు. రాయడంతోపాటు పాడటం, సంగీతం చేకూర్చడం చేసేవాడు.

మలుపు తిప్పిన మైసమ్మ..

1990లో హైదరాబాద్ మాండలికంలో ఉర్దూ తొణికిసలాడేలా... 25 నిమిషాల్లో మాయదారి మైసమ్మ పాట రాశాడు. ఆ పాట బాగా నచ్చిన ఎస్వీసీ రికార్డింగ్ కంపెనీ... క్లెమెంటోతోనే పాట పాడించింది. మాయదారి మైసమ్మ పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మూడు రోజుల్లోనే 5 వేల క్యాసెట్లు అమ్ముడుపోయాయి. తమిళ, హిందీ, ఇంగ్లీష్​లో దాండియా, మర్ఫా ఇలా అన్ని తాళాల్లోనూ మాయదారి మైసమ్మ పాట పాడారు.

పల్లె జనాల స్ఫూర్తితో..

ఎవరి దగ్గర శిక్షణ పొందని క్లెమెంటో... భాగ్యనగరానికి వచ్చే పల్లె జనాలను చూస్తూ వారిని మాటలను పాటలుగా రాసేవాడు. తెల్లవారుజామునే మూడు గంటలకు లేచి తనకు తోచిన పదాలతో పాట రాసేవాడు. జానపదాల్లో ఏ వాక్యానికి ఏ ట్యూన్ వాడాలో తెలుసుకున్న క్లెమెంటో... ఈసీఐఎల్​లో ఉన్న స్టూడియోకు వచ్చి వాటిని రికార్డ్ చేస్తుంటాడు.

లంబా.. లంబా..

తుల్జా భవానీ, సమ్మక్క- సారక్క, ఏడుపాయల దుర్గ, ఎల్లమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, పోచమ్మలపై 2 వేలకుపైగా పాటలు రాశారు. లష్కర్ జాతర బోనాల పండుగ, లంబా లంబా కంబా మీద, పాలపోరగాణ్ని, బాలామణి, కాళ్లకు గజ్జెలు కట్టినాదానా తదితర పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. ఇప్పటి వరకు సుమారు నాలుగన్నర వేల పాటలను రచించిన క్లెమెంటోకు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాల్లోనూ అభిమానులు ఉండటం విశేషం.

ఇదీ చూడండి: 32 ఏళ్లుగా.. వేల పాటలు రాసి అలరిస్తోన్న క్లెమెంటో

మాయదారి మైసమ్మ పాట రచయిత క్లెమెంటో​పై ప్రత్యేక కథనం

ఈయన పేరు క్లెమెంటో... తెలంగాణ జానపద గేయాల రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు. 32 ఏళ్ల కిందట మాయదారి మైసమ్మ పాటతో మొదలైన క్లెమెంటో పాటల ప్రస్థానం... అంచలంచెలుగా ఎదుగుతూ.. నాలుగున్నర వేల పాటలకు చేరింది. ఇంకా రాస్తూ... పాడుతూనే ఉన్నారు. క్లెమెంటో రాసిన పాటలు వింటుంటే... తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు... పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు ప్రజల్లో కూడా ఉరిమే ఉత్సాహం వచ్చేస్తుంది. ఆయన పాడుతుంటే ఎంతటి వారైనా సరే అప్రయత్నంగా చిందులేస్తుంటారు. జానపదాలు రాసే రచయితలు ఎంతో మంది ఉన్నా... క్లెమెంటో శైలే వేరు. అందుకే ఏళ్లు గడుస్తున్నా ఆయన రాసిన, రాస్తోన్న.. పాటలు.. గల్లీల్లో మారుమోగుతూనే ఉన్నాయి.

చిన్నప్పటి నుంచే

సికింద్రాబాద్ లాలగూడలో క్రైస్తవ కుటుంబంలో జన్మించిన క్లెమెంటోకు... పాటలు రాయడమంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి. ఎనిమిదో తరగతిలోనే లాలగూడ రైల్వే బాయ్స్ హైస్కూల్​లో వార్షిక పత్రికలో పాట రాసి ప్రశంసలందుకున్నాడు. ఎన్నో చోట్ల అవకాశాల కోసం ప్రయత్నించినా... నిరాశే మిగిలింది.

బోనాల పాట..

1986లో గణేశ్ నిమజ్జన వేడుకల్లో తన మిత్రుల సహకారంతో పాఠశాలలో రాసిన "పెద్ద చిక్కు వచ్చినాదిరో" పాట పాడాడు. ఆ పాట విన్న డీఆర్సీ రికార్డింగ్ కంపెనీ అధినేత యాదగిరిరావు క్లెమెంటోను ప్రోత్సహించి తన ఆడియో క్యాసెట్​లో పాటపాడే అవకాశం ఇచ్చారు. లష్కర్ జాతరలో బోనాల పండుగ పాట పాడిన క్లెమెంటో అక్కడి నుంచి వెనక్కి తిరిగిచూడలేదు. మూడేళ్లలో 80కిపైగా పాటలు రాశాడు. రాయడంతోపాటు పాడటం, సంగీతం చేకూర్చడం చేసేవాడు.

మలుపు తిప్పిన మైసమ్మ..

1990లో హైదరాబాద్ మాండలికంలో ఉర్దూ తొణికిసలాడేలా... 25 నిమిషాల్లో మాయదారి మైసమ్మ పాట రాశాడు. ఆ పాట బాగా నచ్చిన ఎస్వీసీ రికార్డింగ్ కంపెనీ... క్లెమెంటోతోనే పాట పాడించింది. మాయదారి మైసమ్మ పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మూడు రోజుల్లోనే 5 వేల క్యాసెట్లు అమ్ముడుపోయాయి. తమిళ, హిందీ, ఇంగ్లీష్​లో దాండియా, మర్ఫా ఇలా అన్ని తాళాల్లోనూ మాయదారి మైసమ్మ పాట పాడారు.

పల్లె జనాల స్ఫూర్తితో..

ఎవరి దగ్గర శిక్షణ పొందని క్లెమెంటో... భాగ్యనగరానికి వచ్చే పల్లె జనాలను చూస్తూ వారిని మాటలను పాటలుగా రాసేవాడు. తెల్లవారుజామునే మూడు గంటలకు లేచి తనకు తోచిన పదాలతో పాట రాసేవాడు. జానపదాల్లో ఏ వాక్యానికి ఏ ట్యూన్ వాడాలో తెలుసుకున్న క్లెమెంటో... ఈసీఐఎల్​లో ఉన్న స్టూడియోకు వచ్చి వాటిని రికార్డ్ చేస్తుంటాడు.

లంబా.. లంబా..

తుల్జా భవానీ, సమ్మక్క- సారక్క, ఏడుపాయల దుర్గ, ఎల్లమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, పోచమ్మలపై 2 వేలకుపైగా పాటలు రాశారు. లష్కర్ జాతర బోనాల పండుగ, లంబా లంబా కంబా మీద, పాలపోరగాణ్ని, బాలామణి, కాళ్లకు గజ్జెలు కట్టినాదానా తదితర పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. ఇప్పటి వరకు సుమారు నాలుగన్నర వేల పాటలను రచించిన క్లెమెంటోకు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాల్లోనూ అభిమానులు ఉండటం విశేషం.

ఇదీ చూడండి: 32 ఏళ్లుగా.. వేల పాటలు రాసి అలరిస్తోన్న క్లెమెంటో

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.