హైదరాబాద్లోని పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో 2020 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సోలాపూర్ మేయర్ కాంచన రమేష్ ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మశాలి యువజన సంఘం నాయకులు ఆమెను సన్మానించారు. పద్మశాలీలు రాజకీయాల్లోకి రావాలని, అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని మేయర్ కాంచన రమేష్ సూచించారు.
ఇదీ చూడండి : వీడియోకాల్ ద్వారా పల్లె ప్రగతి పనుల పరిశీలన