ETV Bharat / state

కెనడాలో ప్రవాసాంధ్రుల మహా సుదర్శన యాగం

author img

By

Published : Apr 29, 2020, 10:03 PM IST

లోక కల్యాణార్థం కెనడా కాల్గరీలో శ్రీ అనఘా దత్త సొసైటీలో శ్రీ మహా విష్ణు సుదర్శన యాగాన్ని వైభవంగా నిర్వహించారు. తెలుగు ఎన్నారైలు లలిత, శైలేష్ దంపతులు ఎంతో మంది వాలంటీర్ల సహకారంతో ఈ యాగాన్ని ఘనంగా జరిపారు. నాలుగు రోజుల పాటు నిత్య పూజలు చేశారు.

telugu people in canada
కెనడాలో ప్రవాసాంధ్రుల మహా సుదర్శన యాగం

కెనడాలోని కాల్గరీ శ్రీ అనఘా దత్త సొసైటీ (శ్రీ సాయిబాబా మందిరం)లో ప్రవాసాంధ్రులు... శ్రీ మహా విష్ణు సుదర్శన యాగం నిర్వహించారు. లోక కల్యాణార్థం ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 26 వరకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. చాలా మంది భక్తులు కరోనా కారణంగా ఆన్​లైన్​ ద్వారా ప్రత్యక్ష పూజలను వీక్షించారు. చివరి రోజున శ్రీ మహావిష్ణు, మహాలక్ష్మి కల్యాణంతో క్రతువు ముగిసింది. అతిథులకు మహా నైవేద్యం అందజేశారు.

canadasudharshan yagam in canada
కెనడాలో ప్రవాసాంధ్రుల మహా సుదర్శన యాగం

లలిత, శైలేష్ దంపతులు.. మరెంతో మంది వాలంటీర్ల సహకారంతో ఈ యాగాన్ని వైభవంగా పూర్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది అనఘా, సాయిబాబా భక్తులు మార్చి 24 నుంచి విష్ణు సహస్రనామ పారాయణాన్ని కోటి మూడు లక్షలకు పైగా పఠించారు. విష్ణు సహస్రనామ పారాయణతో కనకధార స్తోత్రం (7600 సార్లు), పురుష సూక్తం (2175 పర్యాయములు), సాయి సూక్తం (1060 పర్యాయములు) పఠించారు.

ఇవీచూడండి: తప్పని డోలీ యానం.. ముందస్తు ప్రసవమై బిడ్డ మృతి

కెనడాలోని కాల్గరీ శ్రీ అనఘా దత్త సొసైటీ (శ్రీ సాయిబాబా మందిరం)లో ప్రవాసాంధ్రులు... శ్రీ మహా విష్ణు సుదర్శన యాగం నిర్వహించారు. లోక కల్యాణార్థం ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 26 వరకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. చాలా మంది భక్తులు కరోనా కారణంగా ఆన్​లైన్​ ద్వారా ప్రత్యక్ష పూజలను వీక్షించారు. చివరి రోజున శ్రీ మహావిష్ణు, మహాలక్ష్మి కల్యాణంతో క్రతువు ముగిసింది. అతిథులకు మహా నైవేద్యం అందజేశారు.

canadasudharshan yagam in canada
కెనడాలో ప్రవాసాంధ్రుల మహా సుదర్శన యాగం

లలిత, శైలేష్ దంపతులు.. మరెంతో మంది వాలంటీర్ల సహకారంతో ఈ యాగాన్ని వైభవంగా పూర్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది అనఘా, సాయిబాబా భక్తులు మార్చి 24 నుంచి విష్ణు సహస్రనామ పారాయణాన్ని కోటి మూడు లక్షలకు పైగా పఠించారు. విష్ణు సహస్రనామ పారాయణతో కనకధార స్తోత్రం (7600 సార్లు), పురుష సూక్తం (2175 పర్యాయములు), సాయి సూక్తం (1060 పర్యాయములు) పఠించారు.

ఇవీచూడండి: తప్పని డోలీ యానం.. ముందస్తు ప్రసవమై బిడ్డ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.