రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ చికిత్సలకు సంబంధించి ప్రైవేటు ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తాజాగా మరో 27 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు 5 ఆసుపత్రులకు కొవిడ్ చికిత్స అనుమతులు రద్దు చేసింది.
అమీర్పేట్ ఇమేజ్ ఆస్పత్రి, ఎల్బీ నగర్లోని అంకుర, కొండాపూర్లోని సియాలైఫ్, షాపూర్నగర్లోని సాయి సిద్ధార్థ, భూత్పూర్లోని పంచవటి ఆసుపత్రుల అనుమతి రద్దు చేశారు. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వం రాష్ట్రంలోని 10 ఆసుపత్రుల అనుమతులు రద్దు చేసినట్లు అయింది. ఇటీవలే 5 ఆస్పత్రుల అనుమతులను రద్దు చేసిన ప్రభుత్వం.. 64 దవాఖానాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి: Investigation : రాష్ట్రంలో వ్యాక్సిన్ల వృథాపై విజిలెన్స్ విచారణ