హైదరాబాద్ ఎంజీబీఎస్కు దుబాయి నుంచి ఏడుగురిని పోలీసులు గాంధీక ఆసుపత్రికి తరలించారు. వీరందరికి క్వారంటైన్ స్టాంప్ ఉండడం వల్ల స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు.
అనుమానితుల్లో కరీంనగర్, నిజామాబాద్కు చెందిన వారు ఒక్కరు చొప్పున, తమిళనాడు నుంచి ఒకరు, కర్ణాటక నుంచి ముగ్గురు ఉన్నారు. వీరంతా దుబాయి నుంచి విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి ఎంజీబీఎస్కు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: జనతా కర్ఫ్యూ'తో ఉత్తర భారతం ఇలా...