నిన్న సాయంత్రం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరడం వల్ల.. తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడిందన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. వర్షపు నీరు రోడ్లపై నిల్వకుండా మోటర్ల ద్వారా నీటిని తొలగించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్తో కలిసి దానకిషోర్ పర్యటించారు. మాదాపూర్ గచ్చిబౌలిలలో రోడ్లపై నీరు నిల్వవుండే ఎనిమిది ప్రదేశాలను గుర్తించామన్నారు. ఎక్కడ చూసిన భారీ భవనాల నిర్మాణాల వల్ల... నాలాల అక్రమణలతో ఈ సమస్య తలెత్తిందని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:వానజల్లు కురిసింది... నేలతల్లి పులకరించింది