ETV Bharat / state

‘టికాస్‌’తో ఎంఎంటీఎస్‌ ప్రయాణం భద్రం

author img

By

Published : Nov 11, 2020, 10:22 AM IST

కాచిగూడ రైలు ప్రమాదానికి నేటికి ఏడాది. ‘టికాస్‌’తో ఎంఎంటీఎస్‌ ప్రయాణం ఇక నుంచి భద్రం కానుంది. కాచిగూడ వంటి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయనుంది. హైదరాబాద్​ నగరంలో టికాస్‌ (ట్రైన్‌ కొల్యూషన్‌ అవాయిడెన్స్‌ సిస్టమ్‌)ను ఏర్పాటు ప్రయాణికులు చేయాలంటున్నారు.

Secure MMTS travel with Ticas
‘టికాస్‌’తో ఎంఎంటీఎస్‌ ప్రయాణం భద్రం

హైదరాబాద్‌ కాచిగూడలో సరిగ్గా ఏడాది క్రితం.. నవంబరు 11న జరిగిన రైలు ప్రమాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. కర్నూలు నుంచి వస్తున్న హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్‌ నడుపుతున్న లోకోపైలట్‌ తీవ్రంగా గాయపడి.. తర్వాత చికిత్స పొందుతూ చనిపోయాడు. స్టేషన్లో ఆగేందుకు నెమ్మదిగా రైల్వే ట్రాక్‌ మారుతూ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ వస్తుండగా అప్పుడే కాచిగూడ నుంచి ఫలక్‌నుమాకు ఎంఎంటీఎస్‌ బయలుదేరింది. రెండు రైళ్లు తక్కువ వేగంతో ఉండడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. కాని ఆ శబ్దానికి ఎంఎంటీఎస్‌ రైల్లో ప్రయాణించేవారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఎంఎంటీఎస్‌ లోకో పైలట్‌ సిగ్నల్‌ గమనించకుండా ముందుకు తీసుకెళ్లాడని రైల్వే నిర్ధారించింది. కాని ఈ ప్రమాదం దక్షిణమధ్య రైల్వేకు అనేక పాఠాలు నేర్పింది. రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొనకుండా.. గతంలో చేసిన టికాస్‌ (ట్రైన్‌ కొల్యూషన్‌ అవాయిడెన్స్‌ సిస్టమ్‌) ప్రయోగాలను తెరమీదకు తెచ్చింది. ఈ వ్యవస్థను ఎంఎంటీఎస్‌లకు అమర్చితే ఎంతో ప్రయోజనమని రైల్వే ప్రయాణికుల సంఘం ప్రతినిధులు సూచిస్తున్నారు.

గతేడాది జరిగిన ప్రమాదంలో పట్టాలు తప్పిన బోగీలు

పట్టాలెక్కిన వ్యవస్థ..

టికాస్‌ అంటే ఎదురెదురుగా కాని.. వెనుక నుంచి కాని రెండు రైళ్లు ఢీకొనకుండా నియంత్రించే విధానం. గతంలో లింగంపల్లి-వికారాబాద్‌-వాడి మధ్య టికాస్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘టికాస్‌’ను భారతీయ రైల్వే అందిపుచ్చుకోవాలని కూడా భావించింది. ఈ క్రమంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ద.మ. రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని ముత్కేడ్‌- సికింద్రాబాద్‌ సెక్షనులో ఉమ్రి- సివున్‌గావ్‌ స్టేషన్ల మధ్య అక్టోబరు 30న 21.5 కిలోమీటర్ల పొడవు మేరకు టికాస్‌ వ్యవస్థను ప్రారంభించింది. రైల్వే ట్రాక్‌పై సిగ్నలింగ్‌తోపాటు అలార్మింగ్‌ (హెచ్చరిక) వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. దీనికి తోడు రైలు ఇంజిన్‌కు ముందు భాగంలో దీనిని అమర్చడం వల్ల ఎదురుగా రైలు వస్తే లోకోపైలట్‌ను హెచ్చరించడమే కాకుండా.. దానంతట అదే ఆగిపోతుంది.

ఎంఎంటీఎస్‌కు వర్తింపజేసేందుకు ప్రయత్నం

రోనా నేపథ్యంలో ప్రస్తుతం ఎంఎంటీఎస్‌ సేవలు రద్దు అయినా.. తర్వాత అయినా ‘టికాస్‌’ వ్యవస్థను అందిపుచ్చుకోవాల్సి ఉందని ఎంఎంటీఎస్‌ రైలు ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు చందు, జంటనగర ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు నూర్‌మహ్మద్‌ కోరుతున్నారు. నగరంలో మొత్తం 16 ఎంఎంటీఎస్‌ రైళ్లున్నాయి. త్వరలో ఎంఎంటీఎస్‌ రెండో దశ కూడా అందుబాటులోకి వస్తున్న వేళ.. ఈ రైళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ‘‘ప్రస్తుతం ఒక సెక్షనులో ప్రారంభించాం.. ద.మ. రైల్వే పరిధిలో 1200 కిలోమీటర్ల పొడవునా చేపట్టేందుకు అనుమతులు కూడా మంజూరయ్యాయన్నారు. ఇందులో ఎంఎంటీఎస్‌ లేనప్పటికీ.. తదుపరి దశలో నగరంలో తిరిగే వీటికి వర్తింపజేసేందుకు ప్రయత్నిస్తాం’’అని ద.మ. రైల్వే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డివిజన్‌ రైల్వే అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: దుబ్బాకలో కారును ముంచిన చపాతి రోలర్‌

హైదరాబాద్‌ కాచిగూడలో సరిగ్గా ఏడాది క్రితం.. నవంబరు 11న జరిగిన రైలు ప్రమాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. కర్నూలు నుంచి వస్తున్న హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్‌ నడుపుతున్న లోకోపైలట్‌ తీవ్రంగా గాయపడి.. తర్వాత చికిత్స పొందుతూ చనిపోయాడు. స్టేషన్లో ఆగేందుకు నెమ్మదిగా రైల్వే ట్రాక్‌ మారుతూ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ వస్తుండగా అప్పుడే కాచిగూడ నుంచి ఫలక్‌నుమాకు ఎంఎంటీఎస్‌ బయలుదేరింది. రెండు రైళ్లు తక్కువ వేగంతో ఉండడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. కాని ఆ శబ్దానికి ఎంఎంటీఎస్‌ రైల్లో ప్రయాణించేవారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఎంఎంటీఎస్‌ లోకో పైలట్‌ సిగ్నల్‌ గమనించకుండా ముందుకు తీసుకెళ్లాడని రైల్వే నిర్ధారించింది. కాని ఈ ప్రమాదం దక్షిణమధ్య రైల్వేకు అనేక పాఠాలు నేర్పింది. రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొనకుండా.. గతంలో చేసిన టికాస్‌ (ట్రైన్‌ కొల్యూషన్‌ అవాయిడెన్స్‌ సిస్టమ్‌) ప్రయోగాలను తెరమీదకు తెచ్చింది. ఈ వ్యవస్థను ఎంఎంటీఎస్‌లకు అమర్చితే ఎంతో ప్రయోజనమని రైల్వే ప్రయాణికుల సంఘం ప్రతినిధులు సూచిస్తున్నారు.

గతేడాది జరిగిన ప్రమాదంలో పట్టాలు తప్పిన బోగీలు

పట్టాలెక్కిన వ్యవస్థ..

టికాస్‌ అంటే ఎదురెదురుగా కాని.. వెనుక నుంచి కాని రెండు రైళ్లు ఢీకొనకుండా నియంత్రించే విధానం. గతంలో లింగంపల్లి-వికారాబాద్‌-వాడి మధ్య టికాస్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘టికాస్‌’ను భారతీయ రైల్వే అందిపుచ్చుకోవాలని కూడా భావించింది. ఈ క్రమంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ద.మ. రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని ముత్కేడ్‌- సికింద్రాబాద్‌ సెక్షనులో ఉమ్రి- సివున్‌గావ్‌ స్టేషన్ల మధ్య అక్టోబరు 30న 21.5 కిలోమీటర్ల పొడవు మేరకు టికాస్‌ వ్యవస్థను ప్రారంభించింది. రైల్వే ట్రాక్‌పై సిగ్నలింగ్‌తోపాటు అలార్మింగ్‌ (హెచ్చరిక) వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. దీనికి తోడు రైలు ఇంజిన్‌కు ముందు భాగంలో దీనిని అమర్చడం వల్ల ఎదురుగా రైలు వస్తే లోకోపైలట్‌ను హెచ్చరించడమే కాకుండా.. దానంతట అదే ఆగిపోతుంది.

ఎంఎంటీఎస్‌కు వర్తింపజేసేందుకు ప్రయత్నం

రోనా నేపథ్యంలో ప్రస్తుతం ఎంఎంటీఎస్‌ సేవలు రద్దు అయినా.. తర్వాత అయినా ‘టికాస్‌’ వ్యవస్థను అందిపుచ్చుకోవాల్సి ఉందని ఎంఎంటీఎస్‌ రైలు ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు చందు, జంటనగర ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు నూర్‌మహ్మద్‌ కోరుతున్నారు. నగరంలో మొత్తం 16 ఎంఎంటీఎస్‌ రైళ్లున్నాయి. త్వరలో ఎంఎంటీఎస్‌ రెండో దశ కూడా అందుబాటులోకి వస్తున్న వేళ.. ఈ రైళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ‘‘ప్రస్తుతం ఒక సెక్షనులో ప్రారంభించాం.. ద.మ. రైల్వే పరిధిలో 1200 కిలోమీటర్ల పొడవునా చేపట్టేందుకు అనుమతులు కూడా మంజూరయ్యాయన్నారు. ఇందులో ఎంఎంటీఎస్‌ లేనప్పటికీ.. తదుపరి దశలో నగరంలో తిరిగే వీటికి వర్తింపజేసేందుకు ప్రయత్నిస్తాం’’అని ద.మ. రైల్వే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డివిజన్‌ రైల్వే అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: దుబ్బాకలో కారును ముంచిన చపాతి రోలర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.