లంచం అడిగిందని నిలదీస్తే ఇంటి వద్దే... నాపై చెప్పుతో దాడి చేసిన మహిళా అధికారిని శిక్షించాలని బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల సంఘం కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తన ఇంటి నిర్మాణంలో కంటోన్మెంట్ బోర్డ్ అధికారి వేధింపుల నుండి రక్షణ కల్పించాలని కోరారు.
పికెట్కు చెందిన రామ్రెడ్డి లాల్బజార్ విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేస్తున్నాడు. తన వందగజాల ఇంటి నిర్మాణ అనుమతి కోసం అధికారికి ధరఖాస్తు చేసుకున్నాడు. ఇంటి నిర్మాణానికి అనుమతి కావాలంటే లంచం ఇవ్వాలని లేదంటే.. నిర్మాణం అడ్డుకుంటామని కంటోన్మెంట్ బోర్డ్లో సర్వేయర్ పనిచేస్తున్న సరిత వేధించిందన్నారు. లంచం అడిగిందని నిలదీస్తే ఇంటివద్ద ఆ అధికారి నాపై చెప్పుతో దాడి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మారేడుపల్లి పోలీసు స్టేషన్లో కేసు పెట్టినప్పటికీ పట్టించుకోకపోవడమే కాకుండా... తనపైనే అక్రమ కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. కంటోన్మెంట్ అధికారుల నుండి రక్షణ కల్పించి.. దాడి చేసిన మహిళా అధికారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు మానవ హక్కుల కమిషన్ను వేడుకున్నారు.
ఇదీ చూడండి: హైదరాబాద్లో కొలువైన అతిపెద్ద ధ్యానమందిరం