ETV Bharat / state

లంచం అడిగిందని నిలదీస్తే... చెప్పుతో దాడి.. - Ram Reddy Complaint against cantonment officer

లంచం అడిగి.. ఆపై చెప్పుతో దాడిచేసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ మహిళా అధికారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మారేడుపల్లి పోలీసు స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది.

secundrabad-cantonment-board-complaint-at-state-human-rights-commission
లంచం అడిగిందని నిలదీస్తే... చెప్పుతో దాడి..
author img

By

Published : Jan 29, 2020, 3:55 PM IST

Updated : Jan 29, 2020, 5:17 PM IST

లంచం అడిగిందని నిలదీస్తే ఇంటి వద్దే... నాపై చెప్పుతో దాడి చేసిన మహిళా అధికారిని శిక్షించాలని బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల సంఘం కమిషనర్​కు ఫిర్యాదు చేశారు. తన ఇంటి నిర్మాణంలో కంటోన్మెంట్ బోర్డ్ అధికారి వేధింపుల నుండి రక్షణ కల్పించాలని కోరారు.

పికెట్​కు చెందిన రామ్​రెడ్డి లాల్​బజార్​ విద్యుత్ శాఖలో లైన్​మెన్​గా పనిచేస్తున్నాడు. తన వందగజాల ఇంటి నిర్మాణ అనుమతి కోసం అధికారికి ధరఖాస్తు చేసుకున్నాడు. ఇంటి నిర్మాణానికి అనుమతి కావాలంటే లంచం ఇవ్వాలని లేదంటే.. నిర్మాణం అడ్డుకుంటామని కంటోన్మెంట్ బోర్డ్​లో సర్వేయర్ పనిచేస్తున్న సరిత వేధించిందన్నారు. లంచం అడిగిందని నిలదీస్తే ఇంటివద్ద ఆ అధికారి నాపై చెప్పుతో దాడి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మారేడుపల్లి పోలీసు స్టేషన్​లో కేసు పెట్టినప్పటికీ పట్టించుకోకపోవడమే కాకుండా... తనపైనే అక్రమ కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. కంటోన్మెంట్ అధికారుల నుండి రక్షణ కల్పించి.. దాడి చేసిన మహిళా అధికారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు మానవ హక్కుల కమిషన్​ను వేడుకున్నారు.

లంచం అడిగిందని నిలదీస్తే... చెప్పుతో దాడి చేస్తారా

ఇదీ చూడండి: హైదరాబాద్​లో కొలువైన అతిపెద్ద ధ్యానమందిరం

లంచం అడిగిందని నిలదీస్తే ఇంటి వద్దే... నాపై చెప్పుతో దాడి చేసిన మహిళా అధికారిని శిక్షించాలని బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల సంఘం కమిషనర్​కు ఫిర్యాదు చేశారు. తన ఇంటి నిర్మాణంలో కంటోన్మెంట్ బోర్డ్ అధికారి వేధింపుల నుండి రక్షణ కల్పించాలని కోరారు.

పికెట్​కు చెందిన రామ్​రెడ్డి లాల్​బజార్​ విద్యుత్ శాఖలో లైన్​మెన్​గా పనిచేస్తున్నాడు. తన వందగజాల ఇంటి నిర్మాణ అనుమతి కోసం అధికారికి ధరఖాస్తు చేసుకున్నాడు. ఇంటి నిర్మాణానికి అనుమతి కావాలంటే లంచం ఇవ్వాలని లేదంటే.. నిర్మాణం అడ్డుకుంటామని కంటోన్మెంట్ బోర్డ్​లో సర్వేయర్ పనిచేస్తున్న సరిత వేధించిందన్నారు. లంచం అడిగిందని నిలదీస్తే ఇంటివద్ద ఆ అధికారి నాపై చెప్పుతో దాడి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మారేడుపల్లి పోలీసు స్టేషన్​లో కేసు పెట్టినప్పటికీ పట్టించుకోకపోవడమే కాకుండా... తనపైనే అక్రమ కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. కంటోన్మెంట్ అధికారుల నుండి రక్షణ కల్పించి.. దాడి చేసిన మహిళా అధికారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు మానవ హక్కుల కమిషన్​ను వేడుకున్నారు.

లంచం అడిగిందని నిలదీస్తే... చెప్పుతో దాడి చేస్తారా

ఇదీ చూడండి: హైదరాబాద్​లో కొలువైన అతిపెద్ద ధ్యానమందిరం

Last Updated : Jan 29, 2020, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.