ETV Bharat / state

'రైతుల సౌకర్యార్థం యాంత్రీకరణ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం' - Agriculture Secretary Dr. B. Janardhan Reddy Latest News

హైదరాబాద్ బషీర్‌బాగ్ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో... జాతీయ ఆహార భద్రత పథకం వెబ్‌ పోర్టల్‌ను కార్యదర్శి బి.జనార్దనరెడ్డి ఆవిష్కరించారు. రైతుల సౌకర్యార్థం యాంత్రీకరణ పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.

Secretary B. Janardhanareddy unveiled the National Food Security Scheme web portal at the office of the Commissioner of Agriculture, Basheerbagh, Hyderabad.
రైతుల సౌకర్యార్థం యాంత్రీకరణ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం
author img

By

Published : Nov 19, 2020, 10:43 PM IST

రాష్ట్రంలో రైతుల సౌకర్యార్థం యాంత్రీకరణ పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దనరెడ్డి అన్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో... జాతీయ ఆహార భద్రత పథకం వెబ్‌ పోర్టల్‌ (htt://nfsm.telangana.gov.in) ను కార్యదర్శి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐసీ స్టేట్ ఇన్‌ఫర్మాటిక్ ఆఫీసర్ రాజశేఖర్, సాంకేతిక సంచాలకులు సురేష్‌కుమార్, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయకుమార్, క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - ఈఓడీబీలో భాగంగా వ్యవసాయ శాఖ, హైదరాబాద్‌ నిక్‌ భాగస్వామ్యంతో ఈ పోర్టల్‌ను రూపొందించాయి. ఈ సందర్భంగా జూమ్ ద్వారా క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడారు.

ఈ వెబ్‌ పోర్టల్ ద్వారా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం పథకం కింద యంత్ర పరికరాలు, లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన, రాయితీ మంజూరు పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో పూర్తి పారదర్శకంగా జరుగుతుందని కార్యదర్శి జనార్దనరెడ్డి తెలిపారు.

లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ఎంపిక చేసుకున్న యంత్ర పరికరాలు సరఫరా చేయడానికి టీఎస్ ఆగ్రోస్ సంస్థను నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని చెప్పారు. ఈ పథకం పారదర్శకంగా... గడువులోగా అమలు చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆయన ఆదేశించారు.

రాష్ట్రంలో రైతుల సౌకర్యార్థం యాంత్రీకరణ పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దనరెడ్డి అన్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో... జాతీయ ఆహార భద్రత పథకం వెబ్‌ పోర్టల్‌ (htt://nfsm.telangana.gov.in) ను కార్యదర్శి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐసీ స్టేట్ ఇన్‌ఫర్మాటిక్ ఆఫీసర్ రాజశేఖర్, సాంకేతిక సంచాలకులు సురేష్‌కుమార్, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయకుమార్, క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - ఈఓడీబీలో భాగంగా వ్యవసాయ శాఖ, హైదరాబాద్‌ నిక్‌ భాగస్వామ్యంతో ఈ పోర్టల్‌ను రూపొందించాయి. ఈ సందర్భంగా జూమ్ ద్వారా క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడారు.

ఈ వెబ్‌ పోర్టల్ ద్వారా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం పథకం కింద యంత్ర పరికరాలు, లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన, రాయితీ మంజూరు పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో పూర్తి పారదర్శకంగా జరుగుతుందని కార్యదర్శి జనార్దనరెడ్డి తెలిపారు.

లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ఎంపిక చేసుకున్న యంత్ర పరికరాలు సరఫరా చేయడానికి టీఎస్ ఆగ్రోస్ సంస్థను నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని చెప్పారు. ఈ పథకం పారదర్శకంగా... గడువులోగా అమలు చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆయన ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.