ETV Bharat / state

Dalit Bandhu 2nd Phase : 'ఎమ్మెల్యేలు చెప్పిన వారికే దళితబంధు..' రెండో విడతలోనూ సేమ్​ టు సేమ్

Dalit Bandhu In Telangana : దళితబంధు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఇటీవలే శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. అయితే లబ్ధిదారుల ఎంపికలో ఈసారీ ఎమ్మెల్యేలే కీలకంగా వ్యవహరించనున్నారు. ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికను కలెక్టర్లకు అప్పగిస్తూ.. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి చేయాలని నిబంధనల్లో చేర్చింది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో రెండో విడతలోనూ ఎమ్మెల్యేలు ఆమోదించిన జాబితాలతోనే లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల మంజూరు జరగనుంది.

Telangana Dalit Bandhu Scheme
Telangana Dalit Bandhu Scheme
author img

By

Published : Jul 23, 2023, 10:52 AM IST

Dalit Bandhu scheme in Telangana : దళితబంధు పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపికలోనూ ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు అర్హులైన దళిత కుటుంబాలను గుర్తించి.. ఆ పథకాన్ని అమలు చేయాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తొలి విడతలో ఎమ్మెల్యేలు నేరుగా లబ్ధిదారుల్ని ఎంపిక చేయగా.. సర్కార్ తాజా ఆదేశాలతో రెండో విడతలోనూ ఇదే పరిస్థితి కొనసాగనుంది.

Telangana Dalita Bandhu 2023 : దళిత జాతి స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ దళితబంధు పథకానికి నాంది పలికారు. అందులో భాగంగా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసి.. వారి పురోగతిని చూడాలని సంకల్పించారు. వారు ఆ నగదుతో వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టి లాభదాయక వ్యాపారం చేసి.. అందరితో సమానంగా ఉండాలని సీఎం​ కోరుకున్నారు.

Second Phase Dalit Bandhu in Telangana : గ్రామాలవారీగా అర్హులైన దళిత కుటుంబాలతో జాబితా రూపొందించాలని.. అలాగే ఎమ్మెల్యేల ఆమోదం అనంతరం.. ఆయా కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని ప్రభుత్వం తెలిపింది. అర్హులైన కుటుంబాలను ఎంపిక చేసి యూనిట్లు మంజూరు చేయాలని స్పష్టం చేసింది. తొలి విడతలో 32 వేల మందికి ప్రభుత్వం ఈ పథకం అమలు చేసింది. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1.3 లక్షల దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయంతో యూనిట్లు మంజూరు చేస్తామని జూన్‌లో వెల్లడించింది. అసెంబ్లీ నియోజకవర్గానికి 1100 మంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో (హుజూరాబాద్‌ మినహా) 1,29,800 మందికి యూనిట్ల మంజూరుకు జాబితాలు రూపొందించాలని కలెక్టర్లకు తెలిపింది.

Dalit Bandhu scheme Across Telangana : తక్షణ అవసరాలకు ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.1000 కోట్లు అందుబాటులో ఉంచింది. జాబితాలు సిద్ధమయ్యాక క్రమంగా నిధులు విడుదల చేస్తామని చెప్పింది. గ్రామాల వారీగా అర్హులైన దళిత కుటుంబాల గుర్తింపు, లబ్ధిదారుల జాబితాలకు ఎమ్మెల్యేల ఆమోదం, క్షేత్రస్థాయిలో పరిశీలన, యూనిట్ల మంజూరుకు సమయం పట్టే అవకాశముందని సంక్షేమ వర్గాలు భావిస్తున్నాయి. దళిత బంధు తొలి విడత అమలులో కొందరు ఎమ్మెల్యేలపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. వారి అనుచరులకే యూనిట్లు మంజూరు చేశారని.. నేతల అనుయాయులు కొందరు లబ్ధిదారుల నుంచి 20-30 శాతం కమీషన్‌ తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఎమ్మెల్యేలు చెప్పిన వారినే ఎంపిక!: ఈ క్రమంలో రెండో విడత లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తగ్గిస్తారని అందరూ భావించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం అమల్లోకి తేవొచ్చని అంచనా వేశారు. అయితే ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికను కలెక్టర్లకు అప్పగిస్తూ.. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి చేయాలని నిబంధనల్లో చేర్చింది. దీంతో ఎమ్మెల్యేలు ఆమోదించిన జాబితాలతోనే లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల మంజూరు జరగనుంది.

ఇవీ చదవండి:

Dalit Bandhu scheme in Telangana : దళితబంధు పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపికలోనూ ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు అర్హులైన దళిత కుటుంబాలను గుర్తించి.. ఆ పథకాన్ని అమలు చేయాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తొలి విడతలో ఎమ్మెల్యేలు నేరుగా లబ్ధిదారుల్ని ఎంపిక చేయగా.. సర్కార్ తాజా ఆదేశాలతో రెండో విడతలోనూ ఇదే పరిస్థితి కొనసాగనుంది.

Telangana Dalita Bandhu 2023 : దళిత జాతి స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ దళితబంధు పథకానికి నాంది పలికారు. అందులో భాగంగా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసి.. వారి పురోగతిని చూడాలని సంకల్పించారు. వారు ఆ నగదుతో వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టి లాభదాయక వ్యాపారం చేసి.. అందరితో సమానంగా ఉండాలని సీఎం​ కోరుకున్నారు.

Second Phase Dalit Bandhu in Telangana : గ్రామాలవారీగా అర్హులైన దళిత కుటుంబాలతో జాబితా రూపొందించాలని.. అలాగే ఎమ్మెల్యేల ఆమోదం అనంతరం.. ఆయా కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని ప్రభుత్వం తెలిపింది. అర్హులైన కుటుంబాలను ఎంపిక చేసి యూనిట్లు మంజూరు చేయాలని స్పష్టం చేసింది. తొలి విడతలో 32 వేల మందికి ప్రభుత్వం ఈ పథకం అమలు చేసింది. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1.3 లక్షల దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయంతో యూనిట్లు మంజూరు చేస్తామని జూన్‌లో వెల్లడించింది. అసెంబ్లీ నియోజకవర్గానికి 1100 మంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో (హుజూరాబాద్‌ మినహా) 1,29,800 మందికి యూనిట్ల మంజూరుకు జాబితాలు రూపొందించాలని కలెక్టర్లకు తెలిపింది.

Dalit Bandhu scheme Across Telangana : తక్షణ అవసరాలకు ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.1000 కోట్లు అందుబాటులో ఉంచింది. జాబితాలు సిద్ధమయ్యాక క్రమంగా నిధులు విడుదల చేస్తామని చెప్పింది. గ్రామాల వారీగా అర్హులైన దళిత కుటుంబాల గుర్తింపు, లబ్ధిదారుల జాబితాలకు ఎమ్మెల్యేల ఆమోదం, క్షేత్రస్థాయిలో పరిశీలన, యూనిట్ల మంజూరుకు సమయం పట్టే అవకాశముందని సంక్షేమ వర్గాలు భావిస్తున్నాయి. దళిత బంధు తొలి విడత అమలులో కొందరు ఎమ్మెల్యేలపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. వారి అనుచరులకే యూనిట్లు మంజూరు చేశారని.. నేతల అనుయాయులు కొందరు లబ్ధిదారుల నుంచి 20-30 శాతం కమీషన్‌ తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఎమ్మెల్యేలు చెప్పిన వారినే ఎంపిక!: ఈ క్రమంలో రెండో విడత లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తగ్గిస్తారని అందరూ భావించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం అమల్లోకి తేవొచ్చని అంచనా వేశారు. అయితే ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికను కలెక్టర్లకు అప్పగిస్తూ.. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి చేయాలని నిబంధనల్లో చేర్చింది. దీంతో ఎమ్మెల్యేలు ఆమోదించిన జాబితాలతోనే లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల మంజూరు జరగనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.