ETV Bharat / state

ఆ రెండు జిల్లాల్లో ఎన్నికల తేదీల్లో మార్పులు

ఏపీలోని పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలను మారుస్తూ.. ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ల వినతి మేరకు రెండు జిల్లాల్లోని పలు మండలాల ఎన్నికల తేదీల్లో మార్పులు చేశారు.

author img

By

Published : Jan 28, 2021, 10:41 PM IST

ఏపీలో రెండు జిల్లాలో పంచాయతీ ఎన్నికల తేదీలు మార్చిన ఎస్​ఈసీ
ఏపీలో రెండు జిల్లాలో పంచాయతీ ఎన్నికల తేదీలు మార్చిన ఎస్​ఈసీ

ఏపీలోని పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లోని పలు మండలాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలను మారుస్తూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ల వినతి మేరకు తేదీల్లో మార్పులు చేశారు. ఒంగోలులో 20కి గాను 15 మండలాలకు తొలి దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒంగోలు డివిజన్​లో మిగిలిన 5 మండలాలైన జె.పంగులూరు, కొరిశపాడు, అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవలో ఫిబ్రవరి 13న రెండో దశలో ఎన్నికలు జరగన్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో మూడో దశకు బదులు ఫిబ్రవరి 13న రెండోదశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏలూరు పరిధిలోని 4 మండలాలకు ఎన్నికల తేదీల్లో మార్పులు జరిగాయి. చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, జె.నర్సాపురం మండలాల్లో నాలుగో దశకు బదులు ఫిబ్రవరి 17న మూడో దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.

ఏపీలోని పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లోని పలు మండలాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలను మారుస్తూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ల వినతి మేరకు తేదీల్లో మార్పులు చేశారు. ఒంగోలులో 20కి గాను 15 మండలాలకు తొలి దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒంగోలు డివిజన్​లో మిగిలిన 5 మండలాలైన జె.పంగులూరు, కొరిశపాడు, అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవలో ఫిబ్రవరి 13న రెండో దశలో ఎన్నికలు జరగన్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో మూడో దశకు బదులు ఫిబ్రవరి 13న రెండోదశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏలూరు పరిధిలోని 4 మండలాలకు ఎన్నికల తేదీల్లో మార్పులు జరిగాయి. చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, జె.నర్సాపురం మండలాల్లో నాలుగో దశకు బదులు ఫిబ్రవరి 17న మూడో దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీచదవండి: 'వారంరోజుల్లో సిద్దిపేట రైల్వేలైన్ పనులు ప్రారంభించాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.