ETV Bharat / state

ఓ పక్క కరోనా విజృంభణ.. మరోపక్క ప్రజల నిర్లక్ష్యం

author img

By

Published : Jul 30, 2020, 1:51 PM IST

ఏపీ అనంతపురం జిల్లా ధర్మవరంలో కరోనా విజృంభిస్తున్న ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కరోనా కేసులు రోజు రోజకూ పెరిగిపోతున్నా.. భౌతిక దూరం పాటించకుండా బయట తిరుగుతున్నారు.

ఓ పక్క కరోనా విజృంభణ.. మరోపక్క ప్రజల నిర్లక్ష్యం
ఓ పక్క కరోనా విజృంభణ.. మరోపక్క ప్రజల నిర్లక్ష్యం

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని అధికారులు పదే పదే చెబుతున్నా జనం మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. నిత్యవసర సరకులు కొనుగోలు తదితర పనుల కోసం వచ్చిన వారితో ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా ధర్మవరం వీధులు కిక్కిరిశాయి. పట్టణంలో ఇప్పటికే 1200 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

నిత్యావసర దుకాణాలు రోజు మార్చి రోజు తెరుస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు మాత్రమే తెరుస్తున్నందున.. గురువారం వేలాది మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఎన్టీఆర్ సర్కిల్ మెయిన్ బజార్ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. జనం రద్దీ అధికంగా ఉన్నందున కరోనా భయంతో పలువురు వ్యాపారస్తులు దుకాణాలు బంద్ చేశారు.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని అధికారులు పదే పదే చెబుతున్నా జనం మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. నిత్యవసర సరకులు కొనుగోలు తదితర పనుల కోసం వచ్చిన వారితో ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా ధర్మవరం వీధులు కిక్కిరిశాయి. పట్టణంలో ఇప్పటికే 1200 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

నిత్యావసర దుకాణాలు రోజు మార్చి రోజు తెరుస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు మాత్రమే తెరుస్తున్నందున.. గురువారం వేలాది మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఎన్టీఆర్ సర్కిల్ మెయిన్ బజార్ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. జనం రద్దీ అధికంగా ఉన్నందున కరోనా భయంతో పలువురు వ్యాపారస్తులు దుకాణాలు బంద్ చేశారు.

ఇదీ చదవడి: సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.